News February 2, 2025
రుద్రంగి:నిర్లక్ష్యంగా వైద్యం చేసిన పీఎంపీ.. సెప్టిక్ గాయానికి గురైన బాలిక

రుద్రంగిలో ఓ బాలికకు పీఎంపీ చేసిన వైద్యం వికటించింది. బాలికకు దెబ్బ తగలగా ఆమె తల్లిదండ్రులు ఓ పీఎంపీ వైద్యుడి వద్దకు చికిత్స కోసం తీసుకెళ్లడంతో ఆ వైద్యుడు బాలికకు ఇంజక్షన్ వేశాడు. గాయం తగ్గకపోవడంతో మళ్లీ ఇంజక్షన్లు వేశాడు. చేసిన ఇంజక్షన్లు వికటించి బాలికకు సెప్టిక్ కావడంతో కోరుట్లలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంజక్షన్ వికటించి సెప్టిక్ అయిందని, సర్జరీ అవసరం అని డాక్టర్లు తెలిపారు.
Similar News
News July 6, 2025
వడమాలపేట: TTDలో ఉద్యోగాల పేరుతో మోసం

వడమాలపేట మండలం అమ్మగుంట హరిజనవాడకు చెందిన పులి శేఖర్ అనే వ్యక్తి TTDలో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నాడు. అతనితోపాటు డిగ్రీ చదివిన వారికి ఫోన్ చేసి TTDలో ఉద్యోగాలు అంటూ ఆశ చూపి వేలుకు వేలు తీసుకుని ముఖం చాటేస్తున్నాడని బాధితులు వాపోయారు.
News July 6, 2025
148 ఏళ్లలో తొలిసారి.. చరిత్ర సృష్టించాడు

ఇంగ్లండ్తో రెండో టెస్టులో పరుగుల వరద పారించిన టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ <<16956685>>రికార్డుల<<>> మోత మోగించారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో 250 ప్లస్, 150 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్గా ఆయన ఖ్యాతి గడించారు. గిల్ తొలి ఇన్నింగ్స్లో 269, రెండో ఇన్నింగ్స్లో 161 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్పై ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, శతకం బాదిన తొలి ప్లేయర్గానూ అతడు రికార్డులకెక్కారు.
News July 6, 2025
HYD: నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు

మొహరం నేపథ్యంలో బీబీ కా ఆలం ఊరేగింపులో భాగంగా నేడు HYDలోని సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని మ్యూజియం అడ్మినిస్ట్రేటివ్ అధికారి తెలిపారు. అదేవిధంగా బీబీ కా ఆలం ఊరేగింపు చార్మినార్ ప్రధాన మార్గాల్లో కొనసాగనున్న నేపథ్యంలో చార్మినార్లోకి ప్రవేశం ఉండదన్నారు. సోమవారం తిరిగి సాలార్ జంగ్ మ్యూజియంలోకి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.
-SHARE IT