News April 7, 2025
రుద్రంగి: ఫుడ్ పాయిజన్తో బాలుడి మృతి

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసి నిహాల్ తేజ (6) అనే బాలుడు <<16016221>>ఫుడ్<<>> పాయిజన్తో సోమవారం ఉదయం వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి తల్లి పుష్పలత మృతి చెందగా.. కుమారుడు సోమవారం మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరు పర్యంతమయ్యారు. మూడు రోజుల క్రితం ఇంట్లో చపాతీలు చేసుకుని తిని వాంతులయ్యాయి. చికిత్స పొందుతూ తల్లి, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 10, 2025
IPL: గుజరాత్ ఘన విజయం

అహ్మదాబాద్లో జరుగుతున్న GTvsRR మ్యాచ్లో గుజరాత్ ఘన విజయం సాధించింది. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 159 పరుగులకే ఆలౌటైంది. శాంసన్-41(28బంతుల్లో), హెట్మెయిర్-52(32 బంతుల్లో) తప్ప బ్యాటర్లెవరూ ప్రతిఘటించలేదు. GT బౌలర్లలో ప్రసిద్ధ్ 3, రషీద్, సాయి కిశోర్ చెరో 2, సిరాజ్, అర్షద్, కుల్వంత్, తలో వికెట్ తీశారు.
News April 10, 2025
ENGకు ఆడటం కంటే ఏదీ ఎక్కువ కాదు: బ్రూక్

ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్గా ఎంపికైన హ్యారీ బ్రూక్ IPL వంటి ఫ్రాంచైజీ టోర్నీల్లో పాల్గొనకపోవడంపై స్పష్టతనిచ్చారు. ‘ENGకు ఆడటానికే నేను ప్రాధాన్యతనిస్తా. దీని కంటే ఏదీ ఎక్కువ కాదు. వేరే టోర్నీల్లో వచ్చే డబ్బును కోల్పోయినా ఫర్వాలేదు. దేశానికి ఆడటాన్నే నేను ఎక్కువగా ఎంజాయ్ చేస్తా’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ IPL సీజన్లో బ్రూక్ DCకి ఆడాల్సి ఉండగా టోర్నీకి ముందు తప్పుకొన్నారు.
News April 10, 2025
కృష్ణా : ముగిసిన ‘పది’ మూల్యాంకణం

మచిలీపట్నం లేడియాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకణ బుధవారంతో ముగిసింది. ఈ నెల 1వ తేదీన మూల్యాంకణ ప్రారంభమవ్వగా మొత్తం 1,89,852 సమాధాన పత్రాలను మూల్యాంకణ చేశారు. సుమారు 1000 మంది ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు మూల్యాంకణ విధుల్లో పాల్గొన్నారు.