News April 7, 2025

రుద్రంగి: ఫుడ్ పాయిజన్‌తో బాలుడి మృతి

image

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసి నిహాల్ తేజ (6) అనే బాలుడు ఫుడ్ పాయిజన్‌తో సోమవారం ఉదయం వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి <<16017738>>తల్లి<<>> పుష్పలత మృతి చెందగా.. కుమారుడు సోమవారం మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీటీ పర్యంతమయ్యారు. మూడు రోజుల క్రితం ఇంట్లో చపాతీలు చేసుకుని తిన్నాక వాంతులయ్యాయి. చికిత్స పొందుతూ తల్లి, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News April 7, 2025

KNR: ఇంటర్, పదోతరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్

image

ఈనెల 20 నుంచి నిర్వహించనున్న ఇంటర్, పదోతరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. 881 మంది విద్యార్థులకు 4 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

News April 7, 2025

ఇల్లందకుంట: పట్టు వస్త్రాలు సమర్పించిన బండి సంజయ్

image

ఇల్లందకుంటలోని సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం సందర్భంగా సోమవారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News April 7, 2025

కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా చిగురుమామిడి మండలంలో 40.1°C నమోదు కాగా, ఇల్లందకుంట, గంగాధర 40.0, జమ్మికుంట, మానకొండూర్ 39.9, సైదాపూర్, శంకరపట్నం, తిమ్మాపూర్ 39.8, కరీంనగర్ రూరల్ 39.5, హుజూరాబాద్ 39.4, వీణవంక 39.2, కరీంనగర్ 38.9, రామడుగు 38.8, చొప్పదండి 38.5, కొత్తపల్లి 38.3, గన్నేరువరం 38.2°C గా నమోదైంది.

error: Content is protected !!