News October 19, 2025

రూ.కోటికి పైగా మోసపోయిన మైదుకూరు MLA..?

image

కడప జిల్లా మైదుకూరు MLA పుట్టా సుధాకర్‌ సైబర్ మోసానికి గురైనట్లు BBC సహా పలు పత్రికలు పేర్కొన్నాయి. ఆ కథనాల మేరకు.. ఈనెల 10వ తేదీ సైబర్ నేరగాళ్లు కాల్ చేసి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు బెదిరించారు. వీడియో కాల్ చేసి డిజిటిల్ అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈక్రమంలో ఎమ్మెల్యే 15వ తేదీ వరకు వివిధ దఫాలుగా రూ.1.07 కోట్లు పంపారు. కేసు క్లియరెన్స్‌కు మరికొంత అడగడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News October 21, 2025

తూర్పుగోదావరి జిల్లా నుంచి తొలి ఐపీఎస్‌ ఆయనే..!

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జన్మించిన పీవీ రంగయ్య నాయుడు జిల్లా నుంచి ఐపీఎస్‌కు ఎంపికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 21 ఏళ్లకే ఆయన ఐపీఎస్ కావడం గమనార్హం. డీజీపీగా, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన సేవలు అందించారు. సర్వీస్ అనంతరం ఆయన రాజకీయాల్లో చేరి, ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర విద్యుత్, నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.

News October 21, 2025

SRPT: ఠాణాపై దాడికి 17 ఏళ్లు.. ఇద్దరు పోలీసులు మృతి

image

తిరుమలగిరి ఠాణాపై నక్సల్స్ దాడి చేసి, ఇద్దరు పోలీసులను బలిగొన్న విషాద ఘటనకు 17 ఏళ్లు. 2007 జులై 7న సుమారు 40 మంది నక్సల్స్ ఠాణాపై దాడికి పాల్పడి, పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ శ్రీరాంరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బడేసాబ్‌లపై కాల్పులు జరిపి వారిని చంపారు. అనంతరం స్టేషన్‌లో ఉన్న ఆయుధాలను అపహరించుకు పోయారు. ఆనాటి అమరవీరుల త్యాగాన్ని జిల్లా ప్రజలు స్మరించుకున్నారు.

News October 21, 2025

సూర్యాపేట ఘటనకు పదేళ్లు.. అమరులైన పోలీసులు

image

సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌ వద్ద 2015, ఏప్రిల్ 1న సిమీ ఉగ్రవాదులు పోలీసులపై జరిపిన కాల్పుల ఘటనకు నేటితో పదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ దారుణంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మెట్టు లింగయ్య, హోంగార్డు మహేష్ అక్కడికక్కడే మృతి చెంది అమరులయ్యారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటనను జిల్లా పోలీసులు, ప్రజలు నేటికీ మరువలేక అమరుల త్యాగాన్ని స్మరించుకుంటున్నారు.