News March 27, 2024
రూ.1.79 కోట్ల నగదు స్వాధీనం: ప్రకాశం ఎస్పీ
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యమని ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఒంగోలులో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు రూ.1,79,95,000 నగదు, 214 గ్రాముల బంగారం, 1,872 లీటర్ల అక్రమ మద్యం, 80.3 గ్రాముల మాదకద్రవ్యాలలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Similar News
News July 3, 2024
ప్రకాశం: ప్రేమ పేరుతో మోసం.. యువకుడి అరెస్టు
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు హనుమంతునిపాడు ఎస్సై తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన అవినాశ్ కొంతకాలంగా బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి శారీరకంగా దగ్గరవడంతో గర్భం దాల్చింది. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అతను తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించామన్నారు.
News July 3, 2024
శానంపూడి ఎంఎల్హెచ్పీ ఆత్మహత్య
శృంగవరపు కోట మండలం శానంపూడి హెల్త్ సెంటర్లో ఎంఎల్హెచ్పీగా పనిచేస్తున్న రమావంత్ రవినాయక్ (33) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రైలు పట్టాలపై రవినాయక్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆదివారం ఆయన స్కూటీపై వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని వారు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలం సమీపంలో స్కూటీని గుర్తించారు.
News July 3, 2024
ప్రకాశం: భర్తను హత్య చేయించిన భార్య.. ఎందుకంటే?
రాచర్ల మండలం రామాపురం గ్రామంలో జూన్ 29వ తేదీన ఓ వ్యక్తిని హతమార్చిన కేసులో ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ బాలసుందరావు మంగళవారం వెల్లడించారు. పొలం పంపకం విషయంలో సొంత భార్య రాజేశ్వరి భర్త స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేయించింది. విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ బాలసుందరావు తెలిపారు.