News February 24, 2025

రూ.18 లక్షల నగదు పట్టివేత: నిర్మల్ ఏఎస్పీ 

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.18 లక్షల నగదును పట్టుకున్నట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా వెల్లడించారు. సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించగా సరైనా ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.18 లక్షల నగదును పట్టుకొని సీజ్ చేశామన్నారు. అనంతరం సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.

Similar News

News February 24, 2025

అర్జీలను నాణ్యతగా పరిష్కారించండి: సబ్ కలెక్టర్

image

ఆదోని సబ్ కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొని ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. నిర్ణీత గడువులోపు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్‌ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.

News February 24, 2025

KCR, KTR ఎవరికి ఓటేస్తారు?: CM రేవంత్

image

TG: MLC ఎన్నికల్లో KCR, KTR, హరీశ్, కవిత సహా ఇతర BRS నేతలు ఎవరికి ఓటేస్తారని CM రేవంత్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో మాట్లాడుతూ ‘ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని BRS నేతలు చెబుతున్నారు. వారు ఎవరిని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పాలి. ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామని అంటున్న వాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? కేసులకు భయపడి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు’ అని ఆరోపించారు.

News February 24, 2025

ఇస్రో నుంచి యువికా 2025 కు దరఖాస్తు చేసుకోండి

image

పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం పేరుతో యువిక -2025 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. సోమవారం నుంచి మార్చి 23 దాకా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించారు. 8వ తరగతి ఉత్తీర్ణులై 9వ తరగతి చదువుతున్న వారు అర్హులు. https//jigyasa.iirs.gov.in/yuvika అనే సైట్ లో అర్హత కలిగిన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇస్రో కోరింది.

error: Content is protected !!