News February 28, 2026

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

image

AP: అనకాపల్లి(D) రాంబిల్లి(M) సీతాపాలెం సెజ్‌లో బ్లూ జెట్ హెల్త్ కేర్ కంపెనీ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. ₹2,300Cr పెట్టుబడితో చేపడుతున్న ఈ అధునాతన ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్స్& CDMO ఫెసిలిటీ ఉత్తరాంధ్ర ఇండస్ట్రీయల్ గ్రోత్‌కు బూస్ట్ ఇస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా 1,750 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు క్యూ కడుతున్నాయన్నారు.

Similar News

News March 1, 2026

నేడు విండీస్‌తో ఢీ.. ఈ’డెన్’ కలిసొస్తుందా?

image

T20WC: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు భారత్-విండీస్ తలపడనున్నాయి. సెమీస్ చేరాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. అయితే 1983 నుంచి ఈడెన్‌లో భారత్‌ను విండీస్ ఎప్పుడూ ఓడించలేకపోయింది. భారత్ చేతిలో నాలుగు T20I సహా తొమ్మిది మ్యాచ్‌లు ఓడిపోగా మరో రెండు డ్రా అయ్యాయి. ఇక 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత విండీస్ ఎప్పుడూ సెమీస్ చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

News March 1, 2026

దౌత్యమే కాపాడింది.. ఆ ఒక్క గల్ఫ్ దేశం సేఫ్!

image

US, ఇజ్రాయెల్‌‌పై ప్రతీకార దాడుల్లో భాగంగా గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతున్న ఇరాన్ ఒమన్‌ను మాత్రం విడిచిపెట్టింది. దౌత్యంలో US, ఇరాన్‌లకు ఒమన్ సమాన ప్రాధాన్యం ఇవ్వడమే కారణం. గతంలో పలు సందర్భాల్లో ఇరు దేశాలకు ఒమన్ మధ్యవర్తిగా పనిచేసింది. దీంతో పాటు ఒమన్‌‌లో US స్థావరం లేదు. మరోవైపు బహ్రయిన్, కువైట్, ఖతార్, UAE, సౌదీ USకు మద్దతు ఇస్తున్నాయి. కాగా ఒమన్‌లో దాదాపు 9లక్షల మంది భారతీయులు ఉన్నారు.

News March 1, 2026

ఖమేనీ చనిపోయారు.. ఆయన బాడీ దొరికింది: ఇజ్రాయెల్ అధికారి

image

ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయారని ఇజ్రాయెల్ అధికారి ధ్రువీకరించినట్లు రైటర్స్ సంస్థ వెల్లడించింది. ఆయన బాడీని కూడా గుర్తించినట్లు ఆ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమేనీ మృతదేహానికి సంబంధించిన ఆధారాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుకు అధికారులు చూపించినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంటోంది. కాగా ఖమేనీ క్షేమంగానే ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ చెబుతూ వస్తోంది.