News January 15, 2025

రూ.255 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేశాం: సుజనా

image

అమరావతి రైతులకు పెండింగ్ కౌలు నగదు విడుదల చేసిన NDA కూటమి ప్రభుత్వం వారింట సంతోషాలు నింపిందని విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి మంగళవారం ట్వీట్ చేశారు. జగన్ హయాంలో పెండింగ్‌లో ఉంచిన కౌలు నగదు ఒకేసారి రూ.255 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన వారికి న్యాయం చేయటం కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యం అని సుజనా స్పష్టం చేశారు.

Similar News

News September 13, 2025

కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు

image

కృష్ణ జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విద్యాసాగర్ నాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్ నాయుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీగా పని చేస్తున్నారు.

News September 13, 2025

గన్నవరంలో రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న గన్నవరంలోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, అండర్-17 బాల బాలికల రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడా కారులు స్టడీ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సీల్ ఉన్న ఎంట్రీ ఫారంతో రావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శులు అరుణ, రాంబాబు తెలిపారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.

News September 13, 2025

ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

image

జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ డీ.కే. బాలాజీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పశుసంపదను రక్షించేందుకు ప్రతి రైతు ఈ టీకా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు.