News April 2, 2025
రూ.266 కోట్లతో అభివృద్ధి పనులు: అన్నమయ్య కలెక్టర్

ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంచ ప్రాధాన్యాల లక్ష్యాన్ని నిర్దేశించిందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. 2025-26 మొదటి త్రైమాసికానికి రూ.266కోట్ల లక్ష్యంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు చెప్పారు. రూ.43కోట్ల అంచనాతో 10వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంపకం, రూ.100 కోట్లతో సీసీ రోడ్లు, మినీ గోకులాల నిర్మిస్తామన్నారు.
Similar News
News November 13, 2025
ఖమ్మం: కాస్ట్ లీ బైక్ కనిపిస్తే అంతే..

సూర్యాపేట(D) చిలుకూరు (M) కట్టకొమ్ముగూడెంకు చెందిన కృష్ణ, నల్గొండ (D) నకిరేకల్ (M) ఆర్లగడ్డగూడెంకు చెందిన శివకుమార్ను SRPT పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వేలిముద్రలను తనిఖీ చేయగా కృష్ణపై 150 బైక్ చోరీ కేసులున్నట్లు గుర్తించారు. అతడిని విచారించగా SRPT, KMM, MLG, NLGతో పాటు HYD, APలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా అతని వద్ద KMM వాసులకు చెందిన 6 బైక్లు ఉన్నాయి.
News November 13, 2025
ప.గో: వైసీపీలో ఆరుగురికి కీలక పదవులు

వైసీపీ రాష్ట్ర కార్యవర్గంలో పలువురిని కార్యదర్శులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. పేరిచర్ల విజయ నరసింహారాజు, ముప్పిడి సంపత్ కుమార్, యడ్ల తాతాజీ, కొట్టు నాగేంద్ర (పశ్చిమగోదావరి ), నూకపెయ్యి సుధీర్ బాబు, డీ వీ ఆర్ కే. చౌదరి (ఏలూరు) నియమితులయ్యారు.
News November 13, 2025
సంగారెడ్డి: టెన్త్ ఫీజు గడువు నేడే లాస్ట్.!

పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువు నేటితో (గురువారం) ముగియనున్నట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇంకా ఫీజు చెల్లించని వారు సాయంత్రంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


