News April 12, 2025

 రూ.2,700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం: మంత్రి రాజనర్సింహ

image

రూ. 2700 కోట్లతో ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల 174వ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఉస్మానియా కళాశాల, ఆసుపత్రి ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినవని తెలిపారు.

Similar News

News February 24, 2026

SRPT: మైనర్లు వాహనం నడిపితే.. ఓనర్‌పైనే కేసు!

image

రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే యజమానులపైనే కేసులు నమోదు చేస్తామన్నారు. ‘అరైవ్ అలైవ్’ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని.. త్రిబుల్ రైడింగ్, నంబర్ ప్లేట్ టాంపరింగ్, సైలెన్సర్ల మార్పుపై నిరంతర తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

News February 24, 2026

సైబర్ కేటుగాళ్లు… నిందితుల్లో బ్యాంకు అధికారులు

image

TG: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్ల గుట్టును హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులు రట్టుచేశారు. ఆక్టోపస్‌ పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టి 16 రాష్ట్రాల్లో 104 మంది కేటుగాళ్లను అరెస్టు చేశారు. వీరిలో బ్యాంకు అధికారులు ఉండడం గమనార్హం. వీరు ₹127 కోట్లకు పైగా కొట్టేశారు. నిందితుల నుంచి ₹36 లక్షల నగదు, 200కు పైగా మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరిపై 1,055 కేసులు ఉన్నట్లు గుర్తించారు.

News February 24, 2026

మల్కాజిగిరి వెబ్‌సైట్ సరే.. జోన్ అధికారుల నంబర్లు?

image

నూతనంగా మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పాటు అనంతరం వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చారు. కానీ.. జోనల్ కమిషనర్ అధికారుల పేర్లు తప్ప, వారి కాంట్రాక్టు వివరాలు, ఈ మెయిల్ అడ్రస్ లాంటివి పొందుపరచలేదు. దీంతో కిందిస్థాయి అధికారులు సమస్యలను పరిష్కరించకుంటే, జోనల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే కాంటాక్ట్ నంబర్లు అందుబాటులో ఉంచాలని పలువురు X వేదికగా డిమాండ్ చేశారు.