News September 26, 2025
రూ.3.57 కోట్లతో అనెక్స్ భవనం ప్రారంభం

AP అసెంబ్లీ ప్రాంగణంలో అనెక్స్ భవనాన్ని గురువారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రులు పయ్యావుల, నారాయణలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియా పాయింట్లో స్పీకర్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన భవనాన్ని అన్ని హంగులతో పునరుద్ధరించేందుకు రూ.3కోట్ల 57 లక్షలతో నిర్మించడం జరిగిందని తెలిపారు. భవనం గ్రౌండ్ ప్లోర్లో మీడియా సమావేశాలకు వీలుగా సుమారు 100 మంది మీడియా ప్రతినిధులు కూర్చోవచ్చన్నారు.
Similar News
News September 27, 2025
అతిసార వ్యాధి నియంత్రణలో ఉంది: కలెక్టర్

గుంటూరు జిల్లాలో అతిసార వ్యాధి నియంత్రణలో ఉందని కలెక్టర్ ఎం. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మొత్తం 177 కేసులు నమోదయ్యాయని, వాటిలో 152 కేసులు గుంటూరు పట్టణం నుంచి, 25 కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయని ఆమె వివరించారు. ఈ వ్యాధిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు.
News September 27, 2025
అమరావతిలో IIULER ఏర్పాటుకు AP అసెంబ్లీ ఆమోదం

అమరావతిలో IIULER ఏర్పాటుకు AP అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభానికి రంగం సిద్ధం చేయనున్నారు. క్యాంపస్ కోసం నామమాత్రపు లీజుకు (₹1/చ.మీ) 55 ఎకరాలు కేటాయించారు. AP విద్యార్థులకు 20% సీట్లు రిజర్వు చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ నిబంధనలు ఉంటాయని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ కింద నడుస్తుంది. అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టారు.
News September 26, 2025
ANU: పీజీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. జులై నెలలో జరిగిన డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఏ డాన్స్, ఎంఏ డాన్స్ కూచిపూడి పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీ లోపు రూ.1,860 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సంప్రదించాలన్నారు.