News April 14, 2025

రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: నాగజ్యోతి

image

మంగపేట మండలం మోట్లగూడెంకు చెందిన నర్సింహారావు కుటుంబానికి రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నాగజ్యోతి డిమాండ్ చేశారు. నరసింహరావు మృతదేహాన్ని నాగజ్యోతి పరామర్శించి, మాట్లాడుతూ.. ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతోనే రైతు నరసింహారావు మనస్తాపంతో పురుగుమందు తాగి మృతి చెందాడన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Similar News

News September 17, 2025

ADB: డిగ్రీలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శివకృష్ణ తెలిపారు. ఈనెల 18, 19న అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. బీఏలో 1, బీకాం (సీఏ)లో 3, బీఎస్సీ బీజేడ్సీలో 3, ఎంపీసీఎస్‌లో 14 , డాటా సైన్స్‌లో 22 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు 9849390495 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News September 17, 2025

నిజాం కాలం నాటి ఆసిఫాబాద్ జైలు

image

ఆసిఫాబాద్ జిల్లాలోని జన్కాపూర్‌లో 1916లో ఐదెకరాల్లో నిర్మించిన జైలు భవనం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. డంగు సున్నంతో నిర్మించిన ఇందులో 200 మంది ఖైదీలు ఉండేలా మూడు బారక్‌లు ఉన్నాయి. 1991లో మరమ్మతులు చేసి తిరిగి ప్రారంభించగా, 2008లో జిల్లా జైలు తరలింపు తర్వాత ఇది సబ్ జైలుగా రూపాంతరం చెందింది. ఈ భవనం ఇప్పటికీ చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది.

News September 17, 2025

వరంగల్: ట్రెండ్ ఫాలో అవ్వండి.. కానీ మోసపోకండి..!

image

‘సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఫొటోలు, లింకుల కోసం అపరిచిత వెబ్‌సైట్లను ఆశ్రయించకండి. తెలియని వ్యక్తులు షేర్ చేసిన లింకులపై క్లిక్ చేయకండి’ అని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తపడాలని, ఏ వెబ్‌సైట్‌ అయినా యూఆర్‌ఎల్‌ను రెండుసార్లు చెక్ చేయడం అలవాటు చేసుకోవాలని తమ అధికారిక X ఖాతా ద్వారా ప్రజలకు సూచించారు.