News September 7, 2025
రూ.350 కోట్లతో భద్రాచలం రాములోరి ఆలయాభివృద్ధి

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి దేవాదాయ శాఖ రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఆలయ పరిసరాలను 4 విడతల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. తొలి విడతగా రూ.115 కోట్లతో ఆలయ కాంప్లెక్స్ తదితర అభివృద్ధి, రెండో విడత రూ.35 కోట్లతో రోడ్లు కాంప్లెక్స్, అడ్మిన్ బ్లాక్, మూడో విడతలో రూ.100 కోట్లతో పార్కులు, నాలుగో విడతలో రూ.100 కోట్లతో హోటల్ తదితర పనులు చేపట్టనున్నారు.
Similar News
News September 8, 2025
సంక్రాంతి బరిలో రవితేజ సినిమా?

కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. జనవరి 13వ తేదీని మూవీ టీమ్ ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీకి ‘అనార్కలి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలాఖరులోగా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కాగా రవితేజ నటించిన ‘మాస్ జాతర’ ఈ ఏడాది అక్టోబర్/ నవంబర్లో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
News September 8, 2025
‘టెట్’ నిబంధనతో సీనియర్లకు అన్యాయం: TS UTF

TG: ప్రభుత్వ టీచర్లకు TET తప్పనిసరి అని ఇచ్చిన <<17587484>>తీర్పును<<>> సుప్రీంకోర్టు పునః సమీక్షించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TS UTF) కోరింది. ’20-25 ఏళ్లుగా విధుల్లో ఉన్న సీనియర్లను TET రాయమనడం అన్యాయం. 2010 కంటే ముందు రిక్రూట్ అయిన వారికి దీని నుంచి మినహాయింపు ఇవ్వాలి. 2010 NCTE నోటిఫికేషన్ ప్రకారం TET పాస్ అనేది నియామకాలకు తప్పనిసరి అయింది’ అని గుర్తుచేసింది.
News September 8, 2025
సంగారెడ్డి: ఉద్యోగాల భర్తీకి రేపే చివరి తేదీ

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన 59 పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఒప్పంద పద్ధతిపై ఇన్స్ట్రక్టర్, ఆయాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు రేపటితో ముగియనున్నదని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.