News March 18, 2024

రూ.5.73 కోట్ల విలువగల బంగారం పట్టివేత: ఎస్పీ 

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ముమ్మర తనిఖీలు చేపట్టిందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఈరోజు మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తా వద్ద డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న  బొలెరో వాహనం ఆపి తనిఖీ చేయగా.. రూ.5.73 కోట్ల బంగారం పట్టుకున్నట్లు తెలిపారు. 

Similar News

News October 21, 2025

మెగా జాబ్ మేళాలో పాల్గొనాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

ఈనెల 25న HZNRలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు NLG జిల్లా నుంచి నిర్దేశిత సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె ఈ నెల 25న హుజూర్నగర్లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాబ్ మేళా పై MGU, ఎన్జీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.

News October 21, 2025

తాత్కాలిక కార్మికులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

image

నల్గొండ జిల్లాలోని తాత్కాలిక (గిగ్) కార్మికులందరికీ జీవిత బీమా సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అమెజాన్, జొమాటో వంటి సంస్థల్లో పనిచేసే రోజువారీ కూలీలు కేవలం రూ. 20 వార్షిక ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చని తెలిపారు. ఈ నెలాఖరులోగా కనీసం 4 వేల మందికి బీమా చేయించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు అవగాహన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.

News October 21, 2025

తెలంగాణ రైజింగ్ – 2047′ సర్వేకు విశేష స్పందన: కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వారం రోజుల క్రితం ప్రారంభించిన ఈ సర్వేలో వివిధ ప్రాంతాల నుంచి పౌరులు పాల్గొని, విలువైన సమాచారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సర్వే ఈనెల 25 వరకు కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.