News August 13, 2025

రూ. 56 లక్షల ఆస్తులు అటాచ్ చేశాం: SP

image

ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన గంజాయి కేసులు అరెస్ట్ అయిన ఒడిశా వాసి నగేశ్‌కు చెందిన ఆస్తులను అటాచ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. గంజాయి వ్యాపారంతో సంపాదించిన స్థిర, చరాస్తులను గుర్తించామని, రూ.56 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేశామన్నారు. ఫ్రీజ్ చేసిన ఆస్తులు కోల్‌కత్తా అథారిటీ పరిధిలో ఉన్నాయని, ఎవరు కొనుగోలు చేసినా చెల్లవన్నారు.

Similar News

News August 14, 2025

రూ.26 కోట్ల అంచనాతో 44 జలవనరుల పనులు: కలెక్టర్

image

జలవనరుల శాఖ ద్వారా రిపేర్, రెనోవేషన్, రెస్టోరేషన్ RRR క్రింద రూ.26 కోట్ల అంచనాతో 44 పనులకు కలెక్టర్ అంబేడ్క‌ర్ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనలను టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభం అవుతాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయని అన్నారు. ఈ పనులకు ఆమోదం లభిస్తే జిల్లాలో 6,873 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని కలెక్టర్ తెలిపారు.

News August 14, 2025

VZM: మరో వారం రోజులే గడువు.. త్వరపడండి..!

image

జిల్లాలో ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలను చదివించేందుకు మిగుల సీట్ల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ మాణిక్యంనాయుడు బుధవారం సూచించారు. 25 శాతం సీట్ల కేటాయింపులో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని, 5 కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాలలకు https://CSE.ap.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 25న లాటరీ ద్వారా ఫలితాలు విడుదల చేస్తామన్నారు.

News August 14, 2025

విజయనగరం జిల్లాలో నేడు హోం మినిస్టర్ పర్యటన

image

విజయనగరం జిల్లాకు హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం రానున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న జిల్లా సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఆమెతో పాటు జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే లు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు కలెక్టర్ అంబేడ్క‌ర్ తెలిపారు.