News October 22, 2024
రూ.8లక్షల కోట్ల అప్పుల ఊబిలో తెలంగాణ: మంత్రి జూపల్లి

గత ప్రభుత్వ బాధ్యతారహిత పాలన కారణంగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రతినెలా వడ్డీ రూపేణా రూ.6 వేల కోట్లను చెల్లించాల్సి వస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎనలేని ఆర్థికభారాన్ని భరిస్తూ తమ ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమాభివృద్ధి రంగాలకు పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తుందన్నారు.
– మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్..?
Similar News
News February 20, 2026
బాసర గోదావరిలో గుర్తు తెలియని మహిళ మృతి

నవీపేట్ మండల పరిధిలోని బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నవీపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
News February 20, 2026
NZB: నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల ఆరాటం

మార్చి15లోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించడంతో ఆశావహుల్లో ఆరాటం మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అసంతృప్తులకు, రెబల్స్కు నామినేటెడ్ పోస్టులు, జిల్లా కమిటీల్లో పార్టీ పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇస్తామన్న హామీలు, భరోసాను కల్పించారు. ఈ నేపథ్యంలో భర్తీ ప్రకటన వెలువడడంతో వారిలో ఆశలు మొదలయ్యాయి. కాగా DCCB ఛైర్మన్ పదవిని పురన్ రెడ్డికి ఖరారు చేసినట్లు సమాచారం.
News February 20, 2026
నిజామాబాద్ కా ‘రాణి’..!

మున్సిపల్ ఎన్నికల వరకు ఆమె ఓ సాధారణ మహిళ. రాజకీయాలు అస్సలు తెలియదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో NZB 49వ డివిజన్ నుంచి ఆమెకు కాంగ్రెస్ టికెట్ లభించింది. కనీసం ప్రచారంలో సైతం పేరు వినిపించని ఆమె గెలుపొంది అనూహ్యంగా నగర ప్రథమ పౌరురాలి స్థానం పొందారు. ఆర్మూర్కు చెందిన జర్నలిస్ట్ బెడిద రాజేశ్వర్రావు కూతురు, కరాటే రమేశ్ భార్య ఉమారాణి. నేడు ఆమె మేయర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.


