News August 14, 2025
రెబ్బెన: ‘అక్రమంగా ఇసుక రవాణా’

రెబ్బెన మండలం గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని హిందూ వాహిని యూత్ సభ్యులు తెలిపారు. ఈ నదిలో భక్తులు పుణ్య స్థానాలు ఆచరిస్తుంటారని, ఇసుక ఉండటంతో పర్యాటకంగా బాగుంటుందన్నారు. అక్రమంగా ఇసుకను తరలించడంతో నది బోసిపోయి అసౌకర్యంగా మారుతుందన్నారు. అధికారులు స్పందించకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
Similar News
News August 15, 2025
మంత్రి పొంగులేటితో ఇన్ఛార్జి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

భారీ వర్షాలు సహాయక చర్యల నిర్వహణపై మంత్రి పొంగులేటి గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ (రెవెన్యూ) తో పాటు టొప్పో పాల్గొన్నారు. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి టొప్పో వివరించారు.
News August 15, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తీరంగా ర్యాలీలు
> రేపు జనగామకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
> స్వతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
> కలెక్టర్ ను కలిసిన శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత
> జఫర్గడ్ పాక్స్ & డీసీసీబీ పాలకవర్గాల గడువు పొడగింపు
> పులివెందులలో జడ్పీటీసీ అభ్యర్థి గెలుపు పాలకుర్తిలో సంబరాలు
> రఘునాథపల్లిలో పర్యటించిన కలెక్టర్
News August 15, 2025
శనివారం వరకు వేటకు వెళ్లరాదు: APSDMA

AP: బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అటు కృష్ణానది వరద ప్రవాహం ఎగువ ప్రాజెక్టులలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని వివరించింది.