News February 24, 2025
రెబ్బెన: పుష్పవతి కావడం లేదని యువతి SUICIDE

పుష్పవతి కావడం లేదని మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(22) పుష్పవతి కావడం లేదని మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.
Similar News
News November 14, 2025
అటవీ భూముల సంరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్

అటవీ భూముల సంరక్షణ అందరి బాధ్యత అని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అటవీ భూముల పరిరక్షణను అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. కలెక్టరేట్లో ఈరోజు DFO కృష్ణ గౌడ్, ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. గిరిజనులు పోడు నరకకుండా చూడటం అత్యవసరమని, ఇందుకోసం వారికి తగిన జీవనోపాధి అవకాశాలు కల్పించడం కీలకమని చెప్పారు.
News November 14, 2025
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్లాన్ ఫెయిల్.. డిపాజిట్లు గల్లంతు

పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిశోర్కు మంచి పేరుంది. ఎన్నికలు ఏవైనా ఆయన ప్లాన్ చేస్తే ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందనే టాక్ ఉండేది. అయితే ఆ వ్యూహాలు తాను స్థాపించిన జన్ సురాజ్ పార్టీని అధికార పీఠం దగ్గరకు కూడా తీసుకొని వెళ్లలేకపోయాయి. బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మొత్తం 239 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2% ఓటు షేర్ మాత్రమే జన్ సురాజ్కు దక్కింది.
News November 14, 2025
బెల్లంపల్లి: పెద్దపులి దాడిలో ఆవు మృతి

బెల్లంపల్లి మండలం బుగ్గగూడ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం సమీప గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రాళ్లవాగు పక్కన ఉన్న పత్తి చేనులో ఆవుపై దాడి చేసిన హతమార్చినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన ఆవు బుగ్గగూడ గ్రామానికి చెందిన ఎల్లక్కదిగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


