News February 15, 2025

రెవెన్యూ సదస్సుల అర్జీలను వేగంగా పరిష్కరించండి: కలెక్టర్

image

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను పెండింగ్లో లేకుండా శనివారం సాయంత్రానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండల స్థాయి డివిజన్ స్థాయిలో ప్రతి సోమవారం అర్జీలను 100% ఆన్‌లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. గ్రామ, మండల స్థాయి అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు.

Similar News

News February 20, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: డీఐఈఓ శ్రీధర్ సుమన్

image

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ల (డీఓ)తో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 6,003 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు.

News February 20, 2026

33 మంది మైనర్లపై లైంగిక వేధింపులు.. స్పెషల్ కోర్టు సంచలన తీర్పు

image

పోక్సో కేసులో UP స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2010 నుంచి పదేళ్లపాటు 33 మంది మైనర్లను లైంగికంగా హింసించిన దంపతులు రామ్, దుర్గావతికి మరణశిక్ష విధించింది. ఆ 33 మందికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిందితులు చాక్లెట్ల ఆశచూపి మైనర్లను దారుణంగా వేధిస్తూ వీడియోలను చిత్రీకరించి డార్క్‌వెబ్‌లో అమ్మేవారు. పాపం పండటంతో 2020లో వారిని సీబీఐ అరెస్టు చేసింది.

News February 20, 2026

గుజరాత్‌లో పారిపోయిన జంటల వివాహ నమోదు కఠినతరం

image

పారిపోయిన జంటల వివాహ రిజిస్ట్రేషన్ల రూల్స్‌ను కఠినతరం చేయనున్నట్లు గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి ప్రకటించారు. ‘లవ్ జిహాద్’ కేసులు పెరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘దేశంలో వివాహం ఓ పవిత్ర ఆచారం. మన కుమార్తెలను తప్పుడు పేర్లతో మోసం చేస్తే సంస్కృతిపై ప్రభావం పడుతుంది. అది సమాజ పతనానికి దారితీస్తుంది. వివాహ పవిత్రతను కాపాడటమే మా లక్ష్యం’ అని స్పష్టం చేశారు.