News February 15, 2025
రెవెన్యూ సదస్సుల అర్జీలను వేగంగా పరిష్కరించండి: కలెక్టర్

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను పెండింగ్లో లేకుండా శనివారం సాయంత్రానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండల స్థాయి డివిజన్ స్థాయిలో ప్రతి సోమవారం అర్జీలను 100% ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. గ్రామ, మండల స్థాయి అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు.
Similar News
News November 4, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,12,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3000 తగ్గి రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 4, 2025
కాకినాడ రూరల్లో వాళ్లదే సెటిల్మెంట్ల హవా!

కాకినాడ రూరల్లో కొందరు నాయకులు సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరపలో ఓ నాయకుడు ‘ఛైర్మన్’ పేరుతో పేకాట శిబిరాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పోలీస్, రెవెన్యూ విభాగాలను ఇతరులకు అప్పగించారని, లేఔట్లు, సెటిల్మెంట్లు ఎమ్మెల్యే బంధువు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేను పిలిచి మందలించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలసిందే.
News November 4, 2025
కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని..

TG: కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టంలేని కుటుంబసభ్యులు అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఝరాసంగం మం. కక్కర్వాడలోని విఠల్ కూతురు, అదే గ్రామానికి చెందిన రాధాకృష్ణ ప్రేమించుకున్నారు. పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. దీంతో విఠల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కుమారుడు పాండుతో కలిసి రాధాకృష్ణ తండ్రిపై ఘోరంగా దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు.


