News August 14, 2025

రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించండి: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని అనంతపురం ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, తహశీల్దార్లు, రీసర్వే డీటీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారంలో RDO, MRO, డిప్యూటీ MRO బాధ్యతగా పనిచేసి, కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Similar News

News August 14, 2025

SKU అకాడమిక్ డీన్‌గా ప్రొఫెసర్ కృష్ణకుమారి నియామకం

image

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అకాడమిక్ డీన్‌గా ప్రొఫెసర్ ఆలూరు కృష్ణకుమారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ యూనివర్సిటీ ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్ బి.అనిత, రిజిస్ట్రార్ రమేశ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈమె ఎస్కేయూ కళాశాల ప్రిన్సిపల్‌గా, యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఈమె జియోగ్రఫీ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

News August 13, 2025

వచ్చే 2 రోజుల పాటు వర్ష సూచన

image

అధిక వర్షాల కారణంగా రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందదని అన్నారు. వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పంట పొలాలపై శ్రద్ధ వహించి అప్రమత్తంగా ఉండాలన్నారు. చీడపీడలు సంభవిస్తే సంబంధిత అధికారులు లేదా శాస్త్రవేత్తలను సంప్రదించాలన్నారు.

News August 12, 2025

అదృశ్యమైన బాలుడు సూసైడ్

image

మూడు రోజుల క్రితం <<17361238>>అదృశ్యమైన<<>> గుమ్మగట్ట మండలం శిరిగేదొడ్డికి చెందిన కైలాస్ అనే 17 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం సమీపంలో విప్రమలై లక్ష్మీనరసింహస్వామి కొండకు శనివారం వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆలయం సమీప కొండలో మంగళవారం ఉదయం దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూశారు. చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.