News November 30, 2024

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహశీల్దార్లు చొరవ చూపాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే సమస్యల పరిష్కారానికి తహశీల్దార్లు ప్రత్యేక చొరవ చూపి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారాని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో రెవెన్యూ సంబంధిత అంశాలపై జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా రీ సర్వే, వెబ్ ల్యాండ్ కరెక్షన్స్ మ్యుటేషన్లకు సంబంధించి రావడం జరుగుతున్నదని తెలిపారు.

Similar News

News December 23, 2025

కడప: ఈ క్రాప్ సరే.. బీమా నమోదు ఎప్పుడు?

image

ఈ ఏడాది రబీ సీజన్లో జిల్లాలో 77,221 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. రైతులు సాగు చేసిన పంటలకు వ్యవసాయ సిబ్బంది ప్రస్తుతం ఈ క్రాప్ చేపడుతున్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాల మధ్య పంటలు నష్టపోతే తగిన పరిహారం పొందేందుకు బీమా చేసుకోవాలని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో ఇంతవరకు NICP, పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News December 23, 2025

కడప జిల్లాలో పలువురు సీఐల బదిలీ

image

ఉమ్మడి కడప జిల్లాలో పలువురు సీఐలను DIG కోయ ప్రవీణ్ సోమవారం బదిలీ చేశారు. ఈ నెల 14న జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేశారు. వారం రోజుల్లోనే మళ్లీ సీఐల బదిలీలు జరిగాయి.
☛ సదాశివయ్య కడప 2టౌన్ నుంచి కడప SB-1కు బదిలీ
☛ ప్రసాదరావు గోనెగండ్ల నుంచి కడప 2టౌన్ బదిలీ
☛ వరప్రసాద్ అన్నమయ్య VR నుంచి అన్నమయ్య SC/ST సెల్‌కు బదిలీ
☛ మస్తాన్ అన్నమయ్య SC/ST సెల్ నుంచి కర్నూల్ సైబర్ సెల్‌కు బదిలీ అయ్యారు.

News December 23, 2025

కడప జిల్లాలో వీకెండ్ ఎమ్మెల్యేలు?

image

కడప జిల్లాలో కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. వారానికి 2 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. కింది స్థాయి నాయకులను పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కడప MLA మాధవిరెడ్డిపై సొంతపార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇక మైదుకూరు MLA పుట్టా సుధాకర్ కూడా వీకెండ్ MLAగా నియోజకవర్గంలో పర్యటించండంతో ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.