News December 11, 2025

రేగు పండ్లు తింటే ఎన్ని లాభాలో..

image

చలికాలంలో లభించే రేగు పండ్లను తరచూ తినడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణ, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మెరుగుపడతాయని వెల్లడిస్తున్నారు. కడుపులో మంట, మలబద్దకం సమస్యలు, చర్మంపై ముడతలు, మొటిమలు తగ్గుతాయంటున్నారు. కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ పండ్లు క్యాన్సర్ కారకాలనూ నిరోధిస్తాయంటున్నారు. మీకు రేగు పండ్లు ఇష్టమా? కామెంట్ చేయండి.

Similar News

News December 12, 2025

WTCలో ఆరో స్థానానికి పడిపోయిన ఇండియా

image

వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్స్ టేబుల్‌లో IND స్థానం మరింత దిగజారింది. తాజాగా WIపై NZ విజయం సాధించడంతో WTC పాయింట్ల పట్టికలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విజయంతో కివీస్‌ మూడో ప్లేస్‌కు చేరుకోగా భారత్‌ ఐదు నుంచి ఆరవ స్థానానికి పడిపోయింది. దీంతో భారత్‌కు <<18401686>>WTC<<>> ఫైనల్‌ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రస్తుతం AUS అగ్రస్థానంలో ఉండగా, SA రెండో స్థానంలో కొనసాగుతోంది.

News December 12, 2025

మోతాదుకు మించి ఎరువులు వద్దు

image

వ్యవసాయంలో నేల, నీరు, విత్తనం తర్వాత ఎరువులు కీలకపాత్ర పోషిస్తాయి. అధిక దిగుబడుల కోసం నిపుణుల సూచనలను పక్కనపెట్టి రైతులు ఎక్కువగా ఎరువులను వాడుతున్నారు. దీని వల్ల పెట్టుబడి భారం పెరగడంతో పాటు ఎరువుల వృథా జరుగుతోంది. అధికంగా వేసిన ఎరువులను మొక్కలు పరిమితంగానే వినియోగించుకుంటాయి. మిగిలినవి భూమిలోకి చేరుతాయి. అందుకే వ్యవసాయ అధికారుల సిఫార్సుల మేరకు పంట దశను బట్టి రైతులు ఎరువులను వాడటం మంచిది.

News December 12, 2025

మూడు రోజుల్లో రూ.3,760 పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ ఉదయం నుంచి <<18540435>>రెండు<<>> సార్లు బంగారం ధరలు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.2,450 పెరిగి రూ.1,33,200కు చేరింది. 3 రోజుల్లోనే రూ.3,760 పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,250 ఎగబాకి రూ.1,22,100 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,15,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.