News March 14, 2025
రేగొండ: విద్యుత్ షాక్తో రైతు మృతి

విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన గోరి కొత్తపల్లి మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవి(52) డీబీఎం-38 కెనాల్ మోటార్ పైపు కింద చెత్తను తొలగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరణ జరిగి రైతు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.
Similar News
News July 4, 2025
మార్కాపురం జిల్లాపై మాటెత్తని పవన్..!

మార్కాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మార్కాపురాన్ని ఎప్పుడు జిల్లా చేస్తామనే దానిపై ఆయన ప్రకటన చేస్తారని ఆశగా చూశారు. కానీ మార్కాపురం జిల్లాపై ఆయన ఏం మాట్లాడలేదు. వెలిగొండ ప్రాజెక్టు భూనిర్వాసితులకు నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇవాళ ప్రారంభించిన జలజీవన్ మిషన్ పనులను తానే పర్యవేక్షిస్తూ 20నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం.
News July 4, 2025
వరంగల్ మార్కెట్లో తగ్గిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర మళ్లీ పడిపోయింది. గత 3 నెలల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా గురువారం క్వింటా పత్తి ధర రూ.7,565 నమోదవగా.. నేడు రూ.7,390కి తగ్గింది. ఒకరోజు వ్యవధిలోనే రూ.175 తగ్గడంతో పత్తి రైతులు నిరాశ చెందుతున్నారు. కాగా, నేడు మార్కెట్కు పత్తి అంతంత మాత్రంగానే వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News July 4, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా? లేదా?

AP: మొహర్రం సందర్భంగా రేపటి ఆప్షనల్ హాలిడేపై స్పష్టత ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ ఆప్షనల్ సెలవును స్కూళ్లు వాడుకోవచ్చా? లేదా? అనే సందిగ్ధత నెలకొందని, విద్యాశాఖ స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. గత వారంలో రథయాత్రకు సెలవు ప్రకటించి, చివరి నిమిషంలో రద్దు చేశారని పేర్కొంటున్నాయి. రేపటి ఆప్షనల్ సెలవుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని కోరుతున్నాయి.