News April 12, 2025

రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో RRRకు వీడ్కోలు

image

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు సాదర వీడ్కోలు లభించింది. శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కూటమి నాయకులు ఆయనకు వీడ్కోలు పలికారు. అనంతరం విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

Similar News

News October 27, 2025

మొంథా ఎఫెక్ట్.. ఏయూలో ఇంటర్వ్యూలు వాయిదా

image

మొంథా తుపాన్ కారణంగా ఏయూలో రేపు జరగాల్సిన వివిధ ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలను నవంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరిపాలన భవనంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్‌లో నిర్వహిస్తామని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలు ఏయూ వెబ్‌సైట్లో పొందుపరిచారు.

News October 27, 2025

డబుల్ సెంచరీ బాదిన పృథ్వీ షా

image

యంగ్ ప్లేయర్ పృథ్వీ షా రంజీలో డబుల్ సెంచరీ బాదారు. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర తరఫున 144 బంతుల్లోనే 200 మార్క్ దాటారు. ఇది రంజీ హిస్టరీ ఎలైట్ గ్రూప్‌లో సెకండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కావడం విశేషం. 29 ఫోర్లు, 5 సిక్సర్లతో 156 బంతుల్లో 222 రన్స్ చేశారు. ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ లేమితో జాతీయ జట్టుకు దూరమైన షా దేశవాళీల్లో రాణిస్తున్నారు.

News October 27, 2025

BC ఓటు బ్యాంకుపైనే RJD గురి

image

బిహార్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ప్రధాన పోటీ NDA, MGBల మధ్యే ఉంది. మహాఘట్‌బంధన్‌లో కీలకమైన RJD BC ఓట్లపై గురిపెట్టింది. పోటీచేస్తున్న143 స్థానాల్లో 51% సీట్లు BCలకు కేటాయించింది. ఇందులో 53సీట్లు యాదవులవే. EBCలకు 11% ముస్లింలకు 13% అగ్రవర్ణాలకు 10% సీట్లు ఇచ్చింది. గత ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండడంతో ఈబీసీల సంఖ్య ఈసారి తగ్గించి బీసీలకు ప్రాధాన్యమిచ్చింది.