News August 31, 2024
రేపటి నుంచి జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపటి నుంచి మూడు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటన వివరాలు తెలిపారు. రేపు ఆమె హైదరాబాద్ నుంచి కడప విమానాశ్రయం చేరుకొని ఇడుపులపాయకు వెళ్లి రాత్రి బసచేస్తారు. 2వ తేదీ తన తండ్రి YSR సమాధి వద్ద నివాళులర్పిస్తారు. 3వ తేదీ జిల్లా కలెక్టర్ను కలిసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్నారు.
Similar News
News February 16, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.15,720
* 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.14,462
* వెండి 10 గ్రాముల ధర రూ.2,505.
News February 16, 2026
కడప: ఇవాళే లాస్ట్.. అప్లై చేశారా?

కడప డివిజన్ పరిధిలోని సావిశెట్టిపల్లి, వెంకటరెడ్డి పల్లితో పాటు 26 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని దొరసాని పల్లి, సిరిగే పల్లి, సుద్ధపల్లె తదితర గ్రామాల్లో 32 పోస్టులను భర్తీ చేస్తారు. జీతం రూ.12 వేల నుంచి రూ.24,470. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <
News February 16, 2026
కడప కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కడప కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి కలెక్టర్ సభా భవనంలో కార్యక్రమం మొదలవుతుందన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. కడపతో పాటు అన్ని మున్సిపల్, మండల తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా అర్జీలు స్వీకరిస్తారని ఆయన స్పష్టం చేశారు.


