News October 31, 2025
రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రేపటి నుంచి 30 రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలకు ప్రజలు సహకరించాలని కోరారు.
Similar News
News October 31, 2025
కళ్యాణదుర్గం: బొలెరో బోల్తా.. ఒకరి మృతి

కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శెట్టూరు నుంచి పామిడి వైపు కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పగిలి నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 31, 2025
భారీ వర్షంలో వేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు: సీఎండీ

మొంథా తుపాను కారణంగా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో దాదాపు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. ముందస్తు జాగ్రత్తలతో భారీ వర్షంలోనూ రేయింబవళ్లు పనిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని చెప్పారు. నీట మునిగిన 249 ట్రాన్స్ఫార్మర్లలో 246 ట్రాన్స్ఫార్మర్లను ఇప్పటివరకు సరిచేశామని స్పష్టం చేశారు.
News October 31, 2025
ప్రకాశం బ్యారేజ్లోకి 4.38L క్యూసెక్కుల వరద

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్లోకి 4.38 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా 69 గేట్ల ద్వారా సముద్రంలోకి జలాలను విడుదల చేస్తున్నారు. కృష్ణా నది తీర ప్రాంతాల్లో చేపల వేటను నిషేధించారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 12.9 అడుగుల నీటి మట్టం ఉండగా, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా మొంథా తుఫాను ధాటికి చెరువులు, నదులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి.


