News April 1, 2026
రేపటి నుంచి JEE మెయిన్ సెషన్-2.. ఇవి తప్పనిసరి

దేశవ్యాప్తంగా గురువారం (ఏప్రిల్ 2) నుంచి జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2, 4, 5, 6, 8 తేదీల్లో పేపర్ 1 (బీఈ/బీటెక్) ఎగ్జామ్స్ జరగనున్నాయి. 9AM-12PM, 3PM-6PM రెండు షిఫ్టుల్లో పరీక్షలు ఉంటాయి. అరగంట ముందే కేంద్రానికి చేరుకుంటే ఉత్తమం. అడ్మిట్ కార్డుతో పాటు రెండు ఫొటోలు, ప్రభుత్వ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ కోసం ఇక్కడ <
Similar News
News April 14, 2026
దివ్యాంగులకు శుభవార్త.. కొత్తగా లక్ష పింఛన్లు!

TG: రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త. కొత్తగా లక్ష మందికి పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వీరయ్య వెల్లడించారు. 40 శాతం వైకల్యం ఉన్నవారికి అవసరమైన అడ్వాన్స్డ్ పరికరాలను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇప్పటికే దివ్యాంగులకు తొలి విడతలో 4,500 ఇందిరమ్మ ఇళ్లను, 2వేల స్కూటీలను ఫ్రీగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
News April 14, 2026
భయంకరమైన వ్యసనం.. సొంత రక్తాన్నే ఇంజెక్ట్ చేసుకుంటున్నారు

భోపాల్(MP)లో యువత భయంకర వ్యసనం బారిన పడుతున్నారు. మత్తు కోసం తమ రక్తాన్ని బయటకు తీసి మళ్లీ శరీరంలోకి ఎక్కించుకుంటున్నారు. JAN నుంచి ఇలాంటి 5 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీన్ని ‘బ్లడ్ కిక్’ అంటున్నారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, సెప్సిస్, హెపటైటిస్, నరాలు దెబ్బతినడం, రక్తం గడ్డకట్టడం తదితర సమస్యలొస్తాయి. డిప్రెషన్, తనకు తానే గాయపర్చుకునే లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.
News April 14, 2026
సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: పొన్నం

TG: RTC ఉద్యోగులు <<19641755>>సమ్మె నిర్ణయాన్ని<<>> వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సంస్థ పరిరక్షణ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని, దీనిపై ఇప్పటికే ఒక కమిటీ పనిచేస్తోందని తెలిపారు. సమస్యలు చెప్పుకోవడానికి తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.


