News February 26, 2025

రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్: కలెక్టర్

image

నల్గొండ – ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికలలో 752 మంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్, సెక్టోరల్ ఆఫీసర్ చొప్పున నియమించామని పేర్కొన్నారు.19 మంది పోటీలో ఉండగా నల్గొండ జిల్లాలో 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News July 9, 2025

కోస్గి: ‘భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి’

image

కోస్గి, గుండుమల్, కొత్తపల్లి మండలాల్లో నిర్మాణంలో ఉన్న మండల కాంప్లెక్స్, జూనియర్ కళాశాల, ఇతర ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయా మండలాల్లో ఆమె పర్యటించారు. నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మూడు మండలాల తహశీల్దారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

News July 9, 2025

జనగామ: ఇది.. మా ఇంటి ఇంకుడు గుంత: కలెక్టర్

image

భూగర్భ జలాలను వృద్ధి చేయాలనే లక్ష్యంతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జిల్లాలో ”మన జిల్లా- మన నీరు ” కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ తన ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను నిర్మించుకున్నారు. ఈ చక్కటి కార్యక్రమంలో కలెక్టరే పలుగు, పార పట్టి ఇంకుడు గుంతను తవ్వారు. బాధ్యతతో మా ఇంట్లో ఇంకుడుగుంతను నిర్మించా.. మీరు సైతం మీ ఇళ్లల్లో ఇంకుడుగుంతను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

News July 9, 2025

జూన్‌లో SIPs ఇన్వెస్ట్‌మెంట్స్ రికార్డు

image

జూన్ నెలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌(SIPs)లో పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మేలో రూ.26,688 కోట్ల ఇన్‌ఫ్లో ఉండగా జూన్‌లో రూ.27,269 కోట్లు వచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ తెలిపింది. మొత్తం SIP అకౌంట్లు 90.6 మిలియన్ల నుంచి 91.9 మిలియన్లకు పెరిగాయని వెల్లడించింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అసెట్స్ జూన్‌లో రూ.74 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది.