News August 25, 2024
రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మంత్రి పొంగులేటి
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో సోమవారం మంత్రి పొంగులేటి పర్యటించనున్నట్లు మంత్రి పీఏ తెలిపారు. ముందుగా ఆయన పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారన్నారు. అనంతరం ఖమ్మం నగరంలో నిర్వహించే పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. తదనంతరం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో గీత కార్మికులకు కాటమయ్య సేఫ్టీ కిట్లను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.
Similar News
News October 7, 2024
న్యూజిలాండ్లో కొత్తగూడెం యువతికి మొదటి బహుమతి
న్యూజిలాండ్ ఆక్లాండ్లోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో కొత్తగూడెం త్రీ ఇంక్లైన్ కార్మిక ప్రాంతానికి చెందిన చంద్రగిరి రేఖ పేర్చిన బతుకమ్మకి మొదటి బహుమతి లభించింది. న్యూజిలాండ్లో స్థిరపడిన తెలంగాణ చెందిన మహిళ కుటుంబాలలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు.
News October 7, 2024
విద్యుత్ షాక్తో బాలిక మృతి
గుండాల మండలంలో విద్యుత్ షాక్తో బాలిక మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. వెన్నెలబైలు గ్రామానికి చెందిన కృష్ణారావు, సుమలత దంపతుల కుమార్తె సువర్ణ (12). ఆదివారం సాయంత్రం ఇంట్లో కరెంట్ వైరు తెగి ఐరన్ తలుపులపై పడింది. అది గమనించని సువర్ణ ఇంట్లోకి వెళుతూ తలుపులను తాకింది. దీంతో షాక్కు గురై మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News October 7, 2024
అశ్వారావుపేట: కరెన్సీ నోట్లతో మండపం
అశ్వారావుపేట మండలం నాయీబ్రహ్మణ సంఘం బజారులోని నాయీబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గామాత మండపాన్ని అందంగా అలంకరించారు. 4వ రోజు ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఏకంగా కొన్ని లక్షల ఫేక్ కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు. మండపం మొత్తం కరెన్సీ నోట్లతో కళకళలాడుతోంది.