News December 30, 2025
రేపు గిగ్ వర్కర్ల సమ్మె.. ఇవాళే తెప్పించుకోండి!

స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ సంస్థల డెలివరీ ఏజెంట్లు రేపు దేశవ్యాప్త <<18699295>>సమ్మెకు<<>> పిలుపునిచ్చారు. 10 నిమిషాల డెలివరీ మోడల్ను రద్దు చేయాలని, సరైన వేతనం, ప్రమాద బీమా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిన్న కారణాలకే ఐడీలను బ్లాక్ చేయడాన్ని నిరసిస్తూ రేపు ‘లాగిన్’ అవ్వకూడదని నిర్ణయించుకున్నారు. రేపు డెలివరీ సర్వీసులు పనిచేయవు కాబట్టి అవసరమైన నిత్యావసరాలను ఇవాళే తెప్పించుకోండి.
Similar News
News January 1, 2026
కరెంట్ ఛార్జీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

AP: కరెంట్ ఛార్జీలపై ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సుమారు ₹4,498 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా తానే భరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు APERCకి అధికారులు లేఖ రాశారు. గత సెప్టెంబర్లోనూ ₹923 కోట్లను ప్రభుత్వం ట్రూడౌన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత నవంబర్ నుంచి <<17870164>>ట్రూడౌన్లో<<>> భాగంగా వినియోగదారులు ఉపయోగించే ఒక్కో యూనిట్పై 13 పైసలు తగ్గింపు ఇస్తున్నారు.
News January 1, 2026
విజయ్-రష్మిక రోమ్ టూర్.. కొనసాగుతున్న సస్పెన్స్

టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న రిలేషన్పై మరోసారి చర్చ జరుగుతోంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇద్దరూ రోమ్కి వెళ్లారు. అయితే ఒకే లొకేషన్లో సింగిల్ ఫొటోలు మాత్రమే షేర్ చేశారు. ఫ్రెండ్స్తో కలిసి వెకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో నిశ్చితార్థం జరిగిందన్న వార్తలు, 2026 <<18708719>>ఫిబ్రవరిలో పెళ్లి<<>> అంటూ ప్రచారం ఊపందుకుంది. ఇప్పటివరకు వారి నుంచి అధికారిక ప్రకటన లేదు.
News January 1, 2026
పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై 40% GST.. FEB 1 నుంచి..

ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, పొగాకు <<18695704>>ఉత్పత్తులపై<<>> నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తాయని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పాన్ మసాలాపై 40% జీఎస్టీతో పాటు సెస్ విధించనుంది. అటు పొగాకు ఉత్పత్తులపై అదనంగా ఎక్సైజ్ డ్యూటీ అమలు కానుంది. అయితే బీడీలపై మాత్రం 18శాతం జీఎస్టీ ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.


