News February 8, 2026

రేపు జానకీ జయంతి.. ఇలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం

image

శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జయంతి రేపు. దీనినే జానకీ జయంతి/సీతా అష్టమి అంటారు. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, తలస్నానం చేయాలి. పీటపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచి సీతారాముల ఫొటో పెట్టి పూలతో అలంకరించాలి. ఎర్ర చీర, పూలు, గాజులు, సింధూరం సమర్పించి పూజించాలి. సీతారాముల అష్టోత్తరం చదవాలి. 5/9 మంది సుమంగళులకు పసుపు కుంకుమ, గాజులు, పూలు ఇచ్చి భోజనం పెట్టాలని పండితులు చెబుతున్నారు.

Similar News

News February 25, 2026

‘జెన్ జీ’ వల్ల రూ.76లక్షల కోట్లు నష్టం!

image

ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ పరిశ్రమ నాలుగేళ్లలో 839 బిలియన్ డాలర్ల(రూ.76లక్షల కోట్లు) మార్కెట్ విలువను కోల్పోయింది. దీనికి కారణం <<17942790>>‘జెన్ జీ’<<>> యువతలో వస్తున్న జీవనశైలి మార్పులేనని పలు నివేదికలు చెబుతున్నాయి. మునుపటి తరాలతో పోలిస్తే జెన్‌ జీలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తూ మద్యానికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆల్కహాల్ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతోంది.

News February 25, 2026

చెరకు పంటలో పీక, కాండం తొలుచు పురుగు ప్రభావం

image

చెరకు నాటిన దగ్గరి నుంచి నరికే వరకు ఈ పురుగులు పైరును ఆశిస్తాయి. బాల్య దశలో పీకపురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా పంటను నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధార చెరకుపై ఎక్కువగా ఉంటుంది. దీని ఉద్ధృతి ఎక్కువైతే పంటకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పురుగుల విషయంలో నిర్లక్ష్యం వద్దని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News February 25, 2026

పార్వతీ దేవి అన్నపూర్ణగా ఎలా మారింది?

image

లోకానికి ఆహారం అందించే దేవత అన్నపూర్ణ దేవి. ఓసారి శివుడు ‘ఆహారం ఓ భ్రమ’ అన్నాడు. దీంతో కోపగించిన పార్వతీదేవి కాశీకి వెళ్లింది. దీంతో సకల జీవరాశులు ఆకలితో అలమటించాయి. అప్పుడు ఆహారం ప్రాముఖ్యం అర్థమైన శివుడు కాశీకి వెళ్లి అమ్మవారిని భిక్ష అడుగుతాడు. పరమేశ్వరుడికే అన్నం పెట్టడంతో ఆ తల్లి ‘అన్నపూర్ణ’గా ప్రసిద్ధి చెందింది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.