News December 20, 2025

రేపు తెలంగాణ భవన్‌కు కేసీఆర్

image

TG: చాలారోజుల తర్వాత గులాబీ బాస్ KCR పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నారు. రేపు మ.2 గంటలకు ఆయన ఆధ్వర్యంలో BRS LP, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ​‘ఏపీ జల దోపిడీ-కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం’ అనే అంశంపై మాట్లాడనున్నారు. సాగునీటి హక్కుల రక్షణ కోసం ‘మరో ప్రజా ఉద్యమం’పై KCR దిశానిర్దేశం చేస్తారని BRS వర్గాలు తెలిపాయి. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనా ఆయన సూచనలు చేస్తారని చెప్పాయి.

Similar News

News January 2, 2026

ఇంట్లోని ఈ వస్తువులు యమ డేంజర్!

image

మనం శుభ్రంగా ఉంటాయని భావించే వస్తువులే బ్యాక్టీరియాకు అసలైన నిలయాలు. పబ్లిక్ టాయ్‌లెట్ సీటు కంటే సూపర్ మార్కెట్ <<18742127>>ట్రాలీలు<<>>, ATM & లిఫ్ట్ బటన్లపై 40 రెట్లు ఎక్కువ క్రిములుంటాయని సర్వేలు చెబుతున్నాయి. మొబైల్స్, ఆఫీస్ కీబోర్డులు, వంటగదిలోని స్పాంజ్‌లు, రిమోట్లు ఇన్ఫెక్షన్లకు కారకాలు. వందల మంది తాకే ఈ వస్తువుల ద్వారా 80% వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి వీటిని వాడాక చేతులను శానిటైజ్ చేసుకోవడం బెటర్.

News January 2, 2026

PCOSతో మహిళల్లో మానసిక సమస్యలు

image

ప్రస్తుతకాలంలో పీసీఓఎస్‌తో బాధపడే మహిళల సంఖ్య పెరిగింది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు పలు మానసిక సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీరిలో త్వరగా మతిమరపు రావడం, డిప్రెషన్‌తో పాటు టైప్‌–2 డయాబెటిస్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పీసీఓఎస్‌తో బాధపడే మహిళల్లో ఆత్మహత్యా ధోరణులు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది.

News January 2, 2026

నదీ జలాల వివాద పరిష్కారానికి 3నెలల గడువు

image

AP, TGల మధ్య నదీ జలాల వివాదంపై ఏర్పాటు చేసిన <<18742119>>కమిటీకి<<>> కేంద్రం 3 నెలల గడువు విధించింది. నీటి నిర్వహణలో సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని సూచించింది. అపరిష్కృత అంశాలను అధ్యయనం చేసి సమాన నీటి భాగస్వామ్యం ఉండేలా సిఫార్సులు ఇవ్వాలంది. ఈ ప్రక్రియలో సంబంధిత విభాగాలను సమావేశాలకు రప్పించవచ్చని తెలిపింది. కాగా 2025 JUL 16న 2రాష్ట్రాల CMలతో నిర్వహించిన భేటీలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించింది.