News March 21, 2024

రేపు నెల్లూరు జిల్లాకు చంద్రబాబు రాక

image

టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి దర్శనానికి వస్తారని జిల్లా టీడీపీ నాయకులు తెలిపారు. రేపు హైదరాబాదు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో 1:00 కు బయలుదేరి రాపూరు(మం) గోనుపల్లిలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు మధ్యాహ్నం 3.15 వస్తానన్నారు. అక్కడనుంచి కారులో స్వామివారిని దర్శించుకుంటారు. తిరిగి ఉండవల్లికి వెళ్తారన్నారు.

Similar News

News February 5, 2025

లోక్‌సభలో నెల్లూరు ఎంపీ ఏంమాట్లాడారంటే?

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. మంగళవారం ఈ మేరకు పలు అంశాలపై ఆయన లోక్‌సభలో ప్రశ్నించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

News February 4, 2025

రూ.40 కోట్లు పలికిన నెల్లూరు జాతి ఆవు

image

బ్రెజిల్‌లో జరిగిన వేలంలో నెల్లూరు జాతి ఆవు అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించింది. బ్రెజిల్‌లోని మినాస్‌ గెరైస్‌లో జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవు 4.8 మిలియన్‌ డాలర్లకు(సుమారు రూ.40 కోట్లకు పైగా) అమ్ముడుపోయింది. ఇది సుమారు 1,101 కిలోల బరువు ఉండటం విశేషం. వియాటినా-19 అత్యధిక ధర పలికిన ఆవుగా గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకుంది. ఈ ఆవును ఒంగోలు జాతి ఆవు అని కూడా పిలుస్తారు.

News February 4, 2025

నెల్లూరు:ల్యాబ్ టెక్నీషియన్ల సమీక్షా సమావేశం

image

అడిషనల్ DMHO ఎస్ కె. ఖాదర్ వలి, జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ నెల్లూరు జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్‌లకు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక మలేరియా అధికారి వి. నాగార్జున రావు, WHO కన్సల్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్‌లు పాల్గొన్నారు.

error: Content is protected !!