News September 12, 2025

రేపు పాఠశాలలకు సెలవు లేదు: డీఈఓ

image

గత నెల 18న వర్షాల కారణంగా ప్రకటించిన సెలవుకు బదులుగా ఈ నెల 13వ తేదీన (రెండో శనివారం) పాఠశాలలు తెరిచి ఉంటాయని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశించినట్లు డీఈఓ రమేశ్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈఓలకు, ఎంఈఓలకు ఆదేశాలు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 12, 2025

అమరావతిలో మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్

image

భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ సౌకర్యం అమరావతిలో రానుంది. క్వాంటం వ్యాలీ “క్వాంటం క్రయోజెనిక్ కాంపోనెంట్స్” ప్రాజెక్ట్‌ను పొందనున్నట్లు తెలుస్తోంది. క్వాంటం వ్యాలీలో దీనిని అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ స్థాపించనుంది. దీని పెట్టుబడి సుమారు 200 కోట్లు అంచనా వేస్తున్నారు. 49.66 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రానున్నట్లు సమాచారం.

News September 12, 2025

అమరావతి ORR అప్డేట్

image

అమరావతి ORR అప్డేట్ వచ్చింది. 140 మీటర్ల వెడల్పుతో సవరించిన DPR ప్రతిపాదనలను రూ.25 వేల కోట్ల అంచనాతో MoRTH సాంకేతిక కమిటీకి పంపారు. ఐతే ఆమోదం పొందిన తర్వాత ఫైల్ PPP అంచనా కమిటీకి, చివరకు ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్‌కు తరలించబడింది. అమరావతి ORR పై రావడంతో ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని పెరిగింది.

News September 12, 2025

కడెం వరద గేట్లు ఎత్తే అవకాశం

image

కడెం పరివాహక ప్రాంతంలో( క్యాచ్మెంట్) వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున శుక్రవారం రాత్రి కడెం ప్రాజెక్టు వరద గేట్లు నుంచి నీళ్లను వదిలే అవకాశం కడెం ప్రాజెక్టు నాల్గవ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు.
నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా చూడాలన్నారు. పశువుల కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.