News March 28, 2025
రేపు భద్రకాళి ఆలయంలో ఒడిశాల బియ్యం వేలం

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి ఆలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన 20 క్వింటాళ్ల ఒడిశాల బియ్యాన్ని ఈ నెల 29న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఈఓ శేషుభారతి తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ.5 వేలు ధరావత్ సొమ్ము డీడీ రూపంలో చెల్లించి పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం భద్రకాళి దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 31, 2025
NLG: వ్యవసాయ అనుసంధాన పనులకూ ‘ఉపాధి’

గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించారు. తాజాగా వ్యవసాయ అనుసంధాన పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా పంట పొలాల వద్దకు మట్టి రోడ్లు, పండ్ల తోటల పెంపకం, పశువుల కొట్టాలు, కోళ్లఫారాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. NLG జిల్లాలో సుమారు నాలుగు లక్షల జాబ్ కార్డులు ఉండగా.. సుమారు ఎనిమిది లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు.
News March 31, 2025
రేపు టెన్త్ ఎగ్జామ్ ఉందా?.. క్లారిటీ

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆప్షనల్ <<15946388>>హాలిడే<<>> ఇవ్వడంతో రేపు జరగాల్సిన సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుందా? లేదా? అనే సందేహం నెలకొంది. దీనిపై క్లారిటీ కోసం Way2News విద్యాశాఖ అధికారులను సంప్రదించింది. ఆప్షనల్ హాలిడే ఇచ్చినంత మాత్రాన పరీక్షలో ఎలాంటి మార్పు ఉండదని, రేపు యథావిధిగా ఎగ్జామ్ ఉంటుందని వారు స్పష్టం చేశారు.
News March 31, 2025
యాలాల్: బాలుడి కిడ్నాప్కు యత్నం..

యాలాల్ మండలం యోన్కెపల్లిలో 8 ఏళ్ల బాలుడిని కిడ్నాప్చేసేందుకు ఓ దుండగుడు యత్నించాడు. గమనించిన స్థానికులు దుండగుడిని నిలదీశారు. అనంతంరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దుండగుడు కొడంగల్ మండలం పర్సాపూర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.