News December 16, 2024

రేపు మంగళరికి రానున్న రాష్ట్రపతి 

image

మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ మధబానందకర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి 49మంది ఎంబీబీఎస్, నలుగురు పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్, సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు పాల్గొంటారన్నారు.

Similar News

News November 8, 2025

తుళ్లూరు: APCRDA ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ

image

APCRDA ఆధ్వర్యంలో VIT- AP యూనివర్సిటీలో రాజధాని ప్రాంత మహిళలకు హౌస్ కీపింగ్‌లో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. శనివారం నుంచి 15 రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుందని అధికారులు తెలిపారు. మొత్తం 76 మంది మహిళలు శిక్షణకు హాజరుకాగా పలువురు అధికారులు పాల్గొన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలకు ఉచిత రవాణా సదుపాయం ఉంటుందని, రాజధాని ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News November 8, 2025

రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు: మంత్రి నారాయణ

image

రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రోడ్లు, తాగు నీరు, డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటు పనులు మొదలు పెడతామని చెప్పారు. కాగా రాజధాని అమరావతికి భూసమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులు నివసించే గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది.

News November 8, 2025

GNT: 19ఏళ్లలో 500 చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు

image

తెలుగు చిత్ర హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు AVSగా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం గుంటూరు (D) తెనాలిలో జన్మించారు. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించిన AVS, మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. 19ఏళ్లలో AVS 500 చిత్రాల్లో నటించాడు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. ఆయనకు తన కుమార్తె లివర్ దానం చేశారు. కాగా నేడు NOV 8 ఆయన వర్ధంతి.