News January 24, 2025
రేపు మంచిర్యాలలో మినీ జాబ్ మేళా

మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 25న ఉదయం 10.30 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రవికృష్ణ తెలిపారు. మినీ జాబ్ మేళాలో పేటీఎంలో 50 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పదో తరగతి, ఇంటర్ విద్యార్హత కలిగి ఉండాలన్నారు. 18-35 ఏళ్ల పురుష అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 3, 2025
VKB: తండ్రికి టాటా చెప్పి.. మృత్యువు ఒడికి

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరు మండలంలోని ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. గౌతాపూర్ గ్రామానికి చెందిన చాంద్ పాషా కూతురు ముస్కాన్ (21) హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం సెలవులో ఇంటికి వచ్చిన ఆమె, సోమవారం ఉదయం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు బయల్దేరింది. బస్సు ఎక్కించే తండ్రికి “టాటా” చెప్పి వెళ్లిన ముస్కాన్ ప్రమాదంలో దుర్మరణం చెందింది.
News November 3, 2025
APలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు: హిందూజా గ్రూప్

AP: రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడికి హిందూజా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. లండన్ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ కాగా పెట్టుబడులకు ముందుకొచ్చారు. విశాఖలో హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1,600MW పెంచేందుకు, రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటుపై MOU పూర్తైంది.
News November 3, 2025
కాకినాడ: జిల్లా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

కాశీబుగ్గ సంఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, పిఠాపురం, సామర్లకోటలలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం ఫోన్లో మాట్లాడిన ఆయన, కాశీబుగ్గ తొక్కిసలాట దృష్ట్యా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.


