News March 30, 2024
రేపు మార్కాపురానికి చంద్రబాబు రాక

ప్రజా గళంలో భాగంగా ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మార్కాపురం పట్టణానికి రానున్నట్లు మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగే సభలో పాల్గొని అక్కడినుంచి హెలికాప్టర్లో మార్కాపురం చేరుకుంటారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Similar News
News January 8, 2026
ప్రకాశంలో మొదలైన సంక్రాంతి సందడి

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కొన్ని కళాశాలల్లో భోగి మంటలు వేసి విద్యార్థులకు పండగ విశిష్టతను ఉపాధ్యాయులు వివరించారు.
News January 8, 2026
రైతులకు రుణాలు మంజూరయ్యేలా చూడాలి: కలెక్టర్

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రుణాలు మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశాన్ని ఆయన గురువారం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేలా సహకార బ్యాంకులు రైతులకు సరైన సమయంలో రుణాలు అందించాలన్నారు.
News January 8, 2026
దోర్నాల: ఆవుల మందపై పులి దాడి

దోర్నాల మండలం బొమ్మలాపురంలోని బీడు పొలంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడిలో ఏరువా చెన్నారెడ్డికి చెందిన ఆవుకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో బొమ్మలపురం గ్రామానికి చెందిన రైతులు, కూలీలు భయాందోళన చెందుతున్నారు. పెద్ద పులి సంచారంపై అటవీ శాఖ అధికారులు గతంలో గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


