News November 17, 2025
రేపు యువజన ఉత్సవాలు.. ఆసక్తి ఉన్నవారు నేరుగా రావచ్చు

సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు జరగబోయే యువజన కళా ఉత్సవాలను విజయవంతం చేయాలని డీవైఎస్ఓ వెంకట నర్సయ్య పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 400 మంది కళాకారులు హాజరుకానున్నట్లు తెలిపారు. వ్యక్తిగత విభాగాలతో పాటు సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల కళాకారులు నేరుగా విపంచి కళానిలయంలో హాజరు కావచ్చని సూచించారు.
Similar News
News November 17, 2025
ఆటోడ్రైవర్ల సమస్యలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు: KTR

TG: ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైరయ్యారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రెన్యూవల్ చేయకపోవడంతో బీమా సౌకర్యం కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని 5 వేల మంది ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా తానే కడతానని పేర్కొన్నారు.
News November 17, 2025
ఆటోడ్రైవర్ల సమస్యలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు: KTR

TG: ఆటోడ్రైవర్ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైరయ్యారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రెన్యూవల్ చేయకపోవడంతో బీమా సౌకర్యం కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని 5 వేల మంది ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా తానే కడతానని పేర్కొన్నారు.
News November 17, 2025
హనుమకొండలో వ్యభిచార ముఠా ARREST

వరంగల్ టాస్క్ఫోర్స్ అధికారులకు అందిన సమాచారంతో ఈరోజు హనుమకొండలోని గోపాల్పూర్లో ఓ ఇంటిపై దాడి చేసి వ్యభిచార నిర్వాహకురాలితోపాటు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.4,270 నగదు,7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కేయూసీ PSకు తరలించామని చెప్పారు. దాడిలో టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, ఇన్స్పెక్టర్ బాబులాల్, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలతారెడ్డి ఉన్నారు.


