News January 4, 2026
రేపు రాజకీయ పార్టీలతో మున్సిపల్ కమిషనర్ భేటీ

భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఓటరు జాబితా ముసాయిదాపై సోమవారం ఉదయం 10:30 గంటలకు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఉదయ్ కుమార్ తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా రూపొందించిన ఎలక్టోరల్ రోల్ ముసాయిదాపై ఈ భేటీలో చర్చించనున్నారు. పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై తమ సలహాలు, సూచనలు అందజేయాలని ఆయన కోరారు.
Similar News
News February 21, 2026
ఆర్మూర్ మున్సిపాలిటీలో రూ.500 కోట్ల కుంభకోణం?

2014-25 మధ్య ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన రూ.500 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడంతో పాత అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ ఇంటి నంబర్ల కేటాయింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. 11 ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది, అవుట్సోర్సింగ్ నియామకాల్లో వసూళ్లపై త్వరలోనే డొంక కదలనుంది.
News February 21, 2026
ఖమ్మం: అడవిని తలపిస్తున్న క్రీడా ప్రాంగణాలు

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం లక్షలతో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు జిల్లాలో నిరుపయోగంగా మారాయి. అధికారులు నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ వీటిని ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు అడుగుపెట్టని పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మైదానాలో చెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.
News February 21, 2026
NTR: లంచం కొట్టు.. ఆ తర్వాతే పన్ను కట్టు!

విజయవాడ కార్పొరేషన్లో పన్నులు చెల్లించాలన్నా లంచాలు సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఖాళీ స్థలం, ఇంటి మ్యుటేషన్ పన్నుల కోసం వచ్చే వారిని RIలు వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డాక్యుమెంట్లు సరిగ్గా లేవని వంకలు పెడుతూ, VROలను కలిసి ‘రేటు’ మాట్లాడుకోవాలని పంపిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఫైలుకు రూ.15వేల-రూ.25వేలు వసూలు చేస్తున్నారని, కమిషనర్ స్పందించి లంచాలని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.


