News February 23, 2025
రేపు శ్రీశైలానికి ఏపీ గవర్నర్ రాక

శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం శ్రీశైలం రానున్నారు. గత నెల 17న శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు గవర్నర్ని కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ మేరకు గవర్నర్ శ్రీశైలం పర్యటన ఖరారైంది. 24న ప్రత్యేక హెలికాప్టర్లో గవర్నర్ సుండిపెంట చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి 25న తిరిగి వెళ్తారు.
Similar News
News October 18, 2025
గ్రూప్-2 అభ్యర్థులకు 48hrs ముందే దీపావళి: CM

TG: గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48 గంటల ముందే దీపావళి వచ్చిందని CM రేవంత్ అన్నారు. HYDలో వారికి నియామక పత్రాలను అందజేశారు. ‘₹లక్ష కోట్లతో కట్టిన “కాళేశ్వరం” మూడేళ్లలోనే కూలింది. గత పాలకులు వారి కుటుంబాల కోసమే ఆలోచించారు. పదేళ్లలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. తన ఫామ్హౌస్లో ఎకరా పంటపై ₹కోటి ఆదాయం వస్తుందన్న పెద్దాయన.. ఆ విద్యను ప్రజలకు ఎందుకివ్వలేదు’ అని ప్రశ్నించారు.
News October 18, 2025
దీపావళిని ఆనందంగా జరుపుకోవాలి: కలెక్టర్

ప్రజలంతా దీపావళి పండుగను సురక్షితంగా, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పర్యావరణహిత టపాసులు కాల్చడంతో వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే 101కు కాల్ చేయాలని సూచించారు.
News October 18, 2025
ఈనెల 20న PGRS రద్దు: కలెక్టర్

ఈ నెల 20వ తేదీన దీపావళి పండగ సందర్బంగా ఆరోజు కలెక్టరెట్లో జరగనున్న PGRS రద్దు చేసినట్లు విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం ప్రకటించారు. తదుపరి వారం నుండి PGRS యథావిధిగా జరుగుతుందని తెలిపారు. ఈవారం PGRS రద్దు విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించి కలెక్టరెట్కు రావద్దని సూచించారు.