News April 23, 2025
రేపు హనుమకొండ జిల్లాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హనుమకొండ జిల్లాకు రేపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు కార్యక్రమాల్లో కవిత పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్కతుర్తిలో BRS రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఎమ్మెల్సీ కవిత పర్యటనకు సంబంధించి నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News April 24, 2025
బాపట్ల: రూ.25 లక్షలతో కొళాయిలు- కలెక్టర్

బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని చిన్న కొత్త గొల్లపాలెంలో జల జీవన్ మిషన్ కింద రూ.25 లక్షలతో కొళాయి కనెక్షన్లు ఇస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి బుధవారం తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీల అమలుపై జిల్లా అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్ కింద పనులు మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
News April 24, 2025
భారత్ ఆరోపణలు.. పాక్ ప్రధాని రేపు కీలక భేటీ

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని దాయాది దేశంపై భారత్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్లో విజయవంతంగా ఎన్నికల నిర్వహణ, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న వేళ దాడులకు పాల్పడినట్లు విమర్శించింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ రేపు నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ తెలిపారు. భారత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తారన్నారు.
News April 24, 2025
కడప: జిల్లా వ్యాప్తంగా కార్డాన్ అండ్ సర్చ్

ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో కడప జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పోలీసులు ప్రజలతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, అల్లర్లకు పాల్పడినా, అల్లర్లకు ప్రేరేపించినా చర్యలు తప్పవన్నారు. ఈ కార్డాన్ అండ్ సర్చ్లో రికార్డులు లేని 57 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.