News July 7, 2025
రేపే అరుణాచలం యాత్ర బస్సు ప్రయాణం: GDK – DM

కాణిపాకం, అరుణాచలం, జోగులాంబ, గోల్డెన్ టెంపుల్ వీక్షించే యాత్రికులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. మంగళవారం ఈ బస్సు ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తిగల భక్తులు బుకింగ్ కోసం 7013504982 ను సంప్రదించాలని కోరారు. ఈ యాత్రకు రాజధాని AC బస్సు సమకూర్చామన్నారు. ఛార్జీలు పెద్దలకు ₹5900, పిల్లలకు ₹4900గా నిర్ణయించామన్నారు.
Similar News
News July 7, 2025
NRPT: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. మొత్తం 30 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
News July 7, 2025
వచ్చే ఏడాది ‘పంచాయత్’ ఐదో సీజన్

కామెడీ డ్రామా సిరీస్ ‘పంచాయత్’ ఐదో సీజన్ను అనౌన్స్ చేసింది. ఈ సీజన్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్టర్ను రిలీజ్ చేసింది. హిందీ భాషలో రూపొందిన ఈ సిరీస్ నాలుగు పార్టులు ఇతర భాషల ప్రేక్షకులనూ మెప్పించాయి. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్ను తెలుగులో ‘సివరపల్లి’ పేరిట రీమేక్ చేసి ఈ ఏడాది జనవరిలో తొలి సీజన్ను రిలీజ్ చేశారు.
News July 7, 2025
అరకు: ఈ నెల 10 సమావేశానికి తల్లిదండ్రులు తప్పనిసరి

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 10వతేదీన పేరెంట్-టీచర్ సమావేశం నిర్వహిస్తున్నట్లు యండపల్లివలస APTWRJC(బాలికలు) ప్రిన్సిపాల్ అల్లు సత్యవతి తెలిపారు. కళాశాల ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుతుందని నేడు ఆమె తెలిపారు. కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని ప్రిన్సిపల్ కోరారు.