News December 26, 2025
రేపే రాజాసాబ్ ‘ప్రీ రిలీజ్’ ఈవెంట్

మారుతీ-ప్రభాస్ కాంబోలో రాజాసాబ్ చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్కు మూవీ టీమ్ అదిరిపోయే గుడ్న్యూస్ అందించింది. HYDలో రేపు సా.5 గంటలకు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.
Similar News
News December 29, 2025
చంద్రబాబుకు కోపం వస్తుందనే ప్రాజెక్టును ఆపేశారు: కేటీఆర్

TG: పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందనే సీఎం రేవంత్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనబెట్టారని కేటీఆర్ విమర్శించారు. ’45 టీఎంసీలకు ఒప్పుకుంటే అన్యాయం చేసినట్లే. ప్రాజెక్టు కడితే KCRకు పేరు వస్తుంది. కృష్ణా నది నుంచి నీళ్లు తీసుకుంటే రేవంత్ పాత బాస్ బాబుకు కోపం వస్తుందనే ప్రాజెక్టును ఆపేసి కాలువలు కూడా తవ్వడం లేదు’ అని మీడియాతో చిట్చాట్లో ఆరోపించారు.
News December 29, 2025
వరి నారుమడిని చలి నుంచి ఎలా రక్షించుకోవాలి?

చలి తీవ్రత పెరిగి రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వరి నారుమడుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిలో భాగంగా రాత్రివేళల్లో నారుమడిపై టార్పాలిన్, పాలిథిన్ షీట్ లేదా సంచులతో కుట్టిన పట్టాలను కప్పి మరుసటి రోజు ఉదయం తీసివేయాలి. దీంతో చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా పెరుగుతుంది. నారు దెబ్బతినకుండా రోజూ ఉదయాన్నే మడిలో చల్లటి నీటిని తీసేసి మళ్లీ కొత్త నీరు పెట్టాలి.
News December 29, 2025
పోలీసుల్నే బురిడీ కొట్టించారు.. ₹లక్షలు స్వాహా!

ఆన్లైన్ మోసాల కేసులు చూసే సైబర్ క్రైమ్ పోలీసులే డబ్బు పోగొట్టుకున్నారు. TTD దర్శన టికెట్స్ కోసమని ఓ అధికారి ₹4 లక్షలు కోల్పోయారు. ఇక స్టాక్స్లో లాభాలు అని ఓ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయగా మరో ఇన్స్పెక్టర్ ₹39L నష్టపోయారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆ ఆఫీసర్స్ ఇద్దరూ నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఈ పోలీసుల అతి నమ్మకం, అత్యాశ తప్ప దొంగల అతి తెలివేం లేదు.


