News April 11, 2025
రేపే రిజల్ట్.. పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 37,831 మంది ఇంటర్ విద్యార్థులు రాయగా వీరిలో ప్రథమ సంవత్సరం 19,708, ద్వితీయ సంవత్సరం 18,123 విద్యార్థులు పరీక్షల రాశారు. మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News January 8, 2026
పాసుపుస్తకాలు పంపిణీ వేగవంతం చేయండి: జేసీ

రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జేసీ రాహుల్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లకు వెళ్లి నేరుగా పాసుపుస్తకాలు అందజేయాలన్నారు. అదే సమయంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
News January 8, 2026
విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలి: జేసీ

డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కింద జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని జేసీ రాహుల్ అన్నారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో జిల్లాస్థాయి స్టీరింగ్ కమ్ సమన్వయ కమిటీ సమావేశంలో జేసీ మాట్లాడారు. ప్రతినెల జిల్లా, మండల స్థాయి అధికారులు పాఠశాలలను సందర్శించాలన్నారు. నిర్దేశించిన మెనూ ప్రకారం ఎటువంటి మార్పులు లేకుండా విద్యార్థులకు సమతుల ఆహారాన్ని అందించాలన్నారు.
News January 8, 2026
ప.గో: యువకుడి ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఉండిలో చోటుచేసుంది. ఉండి శివారు ఉప్పగుంట వద్ద చేపల చెరువు వద్ద పనిచేస్తున్న దీప్ జ్యోతి బాస్మతి (21) చెరువు గట్టు మీద ఉన్న రేకుల షెడ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా మృతుడు తన తండ్రి సుకుమార్తో కలిసి ఉండిలో ఓ చేపలచెరువు వద్ద పనిచేస్తున్నాడు. మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు SI నసీరుల్లా తెలిపారు.


