News December 23, 2024
రేవంత్ ఏడాది పాలనలో ఒర్లుడు తప్పా.. ఓదార్పు లేదు: హరీశ్ రావు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734945240999_51664250-normal-WIFI.webp)
రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఒర్లుడు తప్పా ఓదార్పు లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోమవారం ఆయన మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అడిగిన వాళ్ళను అదరగొట్టుడు, ప్రశ్నించిన వారిమీద పగబట్టుడు తప్ప జరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్ పాలన కంటే రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో 41శాతం క్రైమ్ రేటు పెరిగిందన్నారు. బీఆర్ఎస్ నేతలు, నాయకులు పాల్గొన్నారు.
Similar News
News February 5, 2025
సంగారెడ్డి: నవ వధువు సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738734489024_774-normal-WIFI.webp)
అదనపు కట్నం వేధింపులతో <<15357920>>నవ వధువు<<>> సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ సాకేత్ నగర్కు చెందిన సాయికి సంగారెడ్డి జిల్లా మునిపల్లికి చెందన శ్రీజతో గతేడాది నవంబర్లో పెళ్లైంది. ఇంతలో అదనపు కట్నం కోసం భర్త వేధించ సాగాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చే స్థితిలో మా వాళ్లు లేరని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భర్త వినలేదు. దీంతో విషయం కుటుంబీకులు నిన్న ఫోన్లో చెప్పిన శ్రీజ అనంతరం ఇంట్లో ఉరేసుకుంది.
News February 5, 2025
శివంపేట హత్య కేసు UPDATE
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738726705164_774-normal-WIFI.webp)
శివంపేట మండలం సామ్యతండాలో శనివారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండాకు చెందిన మదన్లాల్ను కత్తితో పొడిచి హత్య చేయగా ఈ కేసుపై తూప్రాన్ సీఐ రంగాకృష్ణ దర్యాప్తు చేపట్టారు. మదన్లాల్ను అన్న కొడుకే హత్య చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. అతడికి సహకరించిన మరో వ్యక్తిని సైతం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
News February 5, 2025
ఆర్టీసీ బస్సులను వినియోగించుకోండి: డీఎం సురేఖ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738715726962_50605465-normal-WIFI.webp)
వివాహ శుభకార్యాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని మెదక్ డీఎం సురేఖ కోరారు. 200 కిలోమీటర్లకు పల్లెవెలుగు బస్సుకు రూ.13,200, ఎక్స్ ప్రెస్ బస్సుకు రూ.14,700 ఉంటుందన్నారు. ఈ రేట్లు 12 గంటల సమయం పాటు వర్తిస్తాయని, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆమె కోరారు.