News May 6, 2024
రేవంత్ రెడ్డి.. నీ బిడ్డ మీద ప్రమాణం చేయ్: నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను నమ్మించి మరోసారి మోసం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నాడని, దేవుళ్లపై ప్రమాణం మానుకొని తన బిడ్డ మీద ప్రమాణం చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గుడ్డిగా ఈ రాష్ట్రానికి సీఎం అయిన రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని సాధించిన మాజీ CM KCRను విమర్శించే స్థాయి లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News September 14, 2025
GREAT: 97 సైబర్ కేసులు.. రూ.32,19,769 రిఫండ్

MBNRలోని నమోదైన సైబర్ క్రైమ్ కేసులను 97 ఛేదించినట్లు సైబర్ క్రైమ్ SI శ్రవణ్ కుమార్ Way2Newsతో తెలిపారు. 97 మంది బాధితులకు సంబంధించి రూ.32,19,769 ఫ్రీజ్ చేయించి రిఫండ్ చేయించామని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశామన్నారు. బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో SP జానకి, అడిషనల్ ఎస్పీ రత్నం అభినందించారు. సైబర్ నెరగాళ్లతో మోసపోయినట్లు తెలిస్తే గంటలోపు 1930 కాల్ చేయాలన్నారు.
News September 14, 2025
MBNR: ఓపెన్ SSC, INTER గడువు పొడగింపు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 18లోగా (ఫైన్ లేకుండా) ఈనెల 20 లోపు (ఫైన్ తో) అప్లై చేసుకోవచ్చని, www.telanganaopenschool.org వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.
News September 14, 2025
మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో డీకే అరుణ

తిరుపతి వేదకగా ఆదివారం ప్రారంభమైన తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పార్లమెంట్ పరిధిలో మహిళా సాధికారత, 10 అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యత, మహిళ 7 ఆత్మగౌరవాన్ని పెంచే దిశలో తీసుకోవాల్సిన చర్యలు, ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై కీలకంగా చర్చించడం జరుగుతుందన్నారు.