News February 9, 2025
రేవుపోలవరం: జాతర ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

రేవుపోలవరంలో ఈనెల 11, 12 తేదీల్లో జరిగే మాఘ పౌర్ణమి జాతర ఏర్పాట్లను నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. జాతర జరిగే రేవుపోలవరం సముద్ర తీరాన్ని శనివారం సందర్శించారు. సముద్ర స్నానాలు ఆచరించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. డీఎస్పీ వెంట సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావు ఉన్నారు.
Similar News
News January 9, 2026
రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్గా పెద్దకడబూరు పీఎస్

పెద్దకడుబూరు పోలీస్స్టేషన్ రాష్ట్రంలోనే అత్యుత్తమ స్టేషన్గా ఎంపికైంది. శుక్రవారం మంగళగిరిలో డీజీపీ హారీశ్ కుమార్ గుప్తా నుంచి డీఐజీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ భార్గవి, ఎస్ఐ నిరంజన్ రెడ్డి ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డు అందుకున్నారు. నేర నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు, కేసుల సత్వర పరిష్కారంలో చూపిన ప్రతిభకు కేంద్ర హోం శాఖ ఈ గుర్తింపునిచ్చింది. ఈ ఘనత జిల్లాకే గర్వకారణమని డీఐజీ పేర్కొన్నారు.
News January 9, 2026
VIRAL PHOTO: కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇస్తున్న కోహ్లీ!

న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్ కోసం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నారు. నెట్స్లో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనను చూడటానికి వచ్చిన అభిమానులకు ఆయన ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. వారిలో ఓ చిన్నారి అచ్చం యంగ్ కోహ్లీలానే కనిపించాడు. దీంతో ‘యంగ్ కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇస్తున్న సీనియర్ కోహ్లీ’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం నుంచి NZతో 3 ODIల సిరీస్ ప్రారంభం కానుంది.
News January 9, 2026
KMR: ముగిసిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్

కామారెడ్డిలో 3 రోజులుగా సాగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ శుక్రవారం ముగిసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1,700 మంది విద్యార్థులు, పాల్గొని 870 అద్భుత ప్రదర్శనలను ప్రదర్శించారు. ఏడు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సౌత్ ఇండియా, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధరామ్ రెడ్డి కార్యక్రమ నివేదికను సమర్పించి, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


