News December 18, 2025
రేషన్ కార్డుదారులకు అలర్ట్

TG: రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. లేదంటే కొత్త సంవత్సరంలో సన్న బియ్యం కోటా నిలిపివేస్తామని ఆదేశాలు జారీ చేసింది. కార్డుల్లో ఉన్న వారు రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రలు వేసి కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పింది. ఐదేళ్ల లోపు పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.
Similar News
News December 19, 2025
అలాంటి ఒప్పందమే లేదు.. ఐదేళ్లు నేనే సీఎం: సిద్దరామయ్య

పవర్ షేరింగ్పై ఎలాంటి రహస్య ఒప్పందం జరగలేదని కర్ణాటక CM సిద్దరామయ్య అన్నారు. ఐదేళ్లు తానే CMగా కొనసాగుతానని అసెంబ్లీలో చెప్పారు. ‘నేను ఇప్పుడు సీఎంను. హైకమాండ్ డిసైడ్ చేసే వరకు కొనసాగుతా. అధిష్ఠానం నాకే ఫేవర్గా ఉంది. 2.5 ఏళ్ల ఒప్పందమేదీ జరగలేదు’ అని తెలిపారు. CM పదవిపై DK శివకుమార్, సిద్దరామయ్య మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ <<18446337>>బ్రేక్ఫాస్ట్<<>> మీటింగ్స్ నిర్వహించారు.
News December 19, 2025
భారీ జీతంతో AVNL ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL) 6 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి BE, B.Tech, PG, PhD, డిప్లొమా, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉంటే JAN 6వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కన్సల్టెంట్, Sr. కన్సల్టెంట్కు నెలకు రూ.1,20,000+IDA, Sr. మేనేజర్కు రూ.70000+IDA, Jr. మేనేజర్కు రూ.30,000+IDA చెల్లిస్తారు. వెబ్సైట్: avnl.co.in/
News December 19, 2025
నిత్య పూజ ఎలా చేయాలి?

నిత్య పూజ భగవంతుని పట్ల భక్తిని చాటుకునే ప్రక్రియ. దీనిని షోడశోపచార/పంచోపచార పద్ధతుల్లో చేయవచ్చు. స్నానం చేశాక శుభ్రమైన వస్త్రాలు ధరించి, దీపారాధనతో పూజ ప్రారంభించాలి. ముందుగా గణపతిని, ఆపై కులదైవాన్ని ధ్యానిస్తూ ఆవాహన, ఆసనం, స్నానం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. ఆఖరున హారతి ఇచ్చి, ఆత్మప్రదక్షిణ చేసి నమస్కరించుకోవాలి. పూజలో సామాగ్రి కంటే శుద్ధమైన మనస్సు, ఏకాగ్రత, భక్తి ముఖ్యం.


