News October 8, 2025

రైతులకు ఇబ్బందులేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి: కలెక్టర్

image

రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను నారాయణపేట కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. బుధవారం ఆర్డీఓ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలన్నారు. జిల్లాలో 110 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 312 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Similar News

News October 8, 2025

SRCL: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ సమీక్ష

image

వరి ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్(2025-26) ధాన్యం కొనుగోళ్ల సన్నాహక సమావేశం వివిధ శాఖల అధికారులు, ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

News October 8, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ ఉదయంతో పోల్చితే సాయంత్రానికి భారీగా పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,150 పెరగ్గా ఇప్పుడు మరో రూ.760 ఎగిసి రూ.1,23,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ఉదయం రూ.1,050 ఎగబాకగా సాయంత్రానికి మరో రూ.700 పెరిగి రూ.1,13,600 పలుకుతోంది. అటు KG వెండి ధర మార్నింగ్ రూ.100 తగ్గగా ఇప్పుడు రూ.3000 పెరిగి రూ.1,70,000కి చేరుకుంది.

News October 8, 2025

KMR: కలెక్టర్ చొరవ.. బాలికలకు ISRO టూర్

image

కామారెడ్డి జిల్లా చరిత్రలో తొలిసారిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చొరవతో 10వ తరగతి చదువుతున్న 30 మంది బాలికలను ప్రభుత్వ ఖర్చుతో ISRO టూర్‌కు తీసుకెళ్లనున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. ఈ పర్యటన కోసం బుధవారం స్పేస్ సైన్స్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించామన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్‌కు జిల్లా విద్యార్థులు, విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు.